నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రాజకీయా ఎత్తుగడలతో రోజు రోజుకి మారిపోతూ మంచి రంజుగా మారాయి. వైసీపీ నుండి వేమిరెడ్డి , అతని భార్య ప్రశాంతి టీడీపీలో జాయిన్ అయ్యారు. ప్రశాంతి కోవూరులో టీడీపీ తరపున పోటిలో నిలబడ్డారు. మొదట నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తమ్ముడిని మూడు కోట్లు ఇస్తామని, టీడీపీలోకి రమ్మని అన్నదమ్ములను విడదీయడానికి మాట్లాడిన కాల్ రికార్డింగ్ హల్చల్ చేసింది. అంతే కాకుండా ప్రతి నాయకుడికి , కార్యకర్తకు రేటు కట్టి డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లుతూ వైసీపీ లోని కొంతమందిని తమతో పాటు టీడీపీలోకి జాయిన్ చేసుకున్నారు.
మళ్ళీ నిన్న రాత్రి వేమిరెడ్డి దంపతుల సమక్షంలో టీడీపీలో బుచ్చి నగర పంచాయతీ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మరియు మోర్ల మురళితో పాటు 14వ వార్డ్ కౌన్సిలర్ చిర్ల ప్రసాద్ యాదవ్ టీడీపీలో జాయిన్ అయ్యారు. దీనితో కోవూరులో ప్రసన్న పని అయిపోయిందని తమ అనుకూల మీడియాలో విపరీతమైన ప్రచారం చేశారు. ఇక్కడే కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన చాణక్యంతో బుచ్చి మున్సిపల్ చైర్మన్ సుప్రజ ,తన భర్త మురళీతో పాటు 14వ వార్డ్ కౌన్సిలర్ చిర్ల ప్రసాద్ ను గంటల వ్యవధిలోనే తిరిగి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన సమక్షంలో సొంత గూటికి చేరేలా చక్రం తిప్పారు. దీనితో వేమిరెడ్డి దంపతులు షాక్ కి గురయ్యారు .
ఇప్పటికే గ్రామ స్థాయికి ఒకరేటు, మండల స్థాయి నాయకులకి ఒకరేటూ పెట్టి కొంటున్నా వేమిరెడ్డి దంపతులకు ఇదీ మాత్రం భారీ షాక్. ఇదంత చూసిన కోవూరు ప్రజలు డబ్బులు కట్టలు చూపించి వెదజల్లి రాజకీయం చేద్దాం అనుకుంటే నల్లపురెడ్డి కుటుంబం రాజకీయ చాణక్యం ముందు నిలబడలేరు అంటూ గుసగుస లాడుతున్నారు.