ఒక రాజకీయ నాయకుడిగా కన్నా కాపు ఉద్యమ నాయకుడిగానే ఎక్కువ ప్రసిధ్ధి. కాపులందరినీ ఏకతాటిపైకి తెచ్చి, కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న బలమైన నేత. ఆయన ఇప్పుడు వైసీపీలో చేరి… జగన్కు బేషరతుగా మద్దతు ప్రకటించబోనున్నారు. అంతే కాక ఎటువంటి పదవులు ఆశించటం లేదనీ… కేవలం వైసీపీ విజయమే లక్ష్యమనీ ప్రకటించారు. ఈ నెల పద్నాలుగన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.
అయితే ముద్రగడ రాజకీయ ప్రస్థానం మొదటి నుంచీ ఆసక్తిదాయకమే. 1977 తండ్రి ముద్రగడ వీర రాఘవయ్య హటన్మరణంతో… రాజకీయాల్లోకి ప్రవేశం చేసిన ముద్రగడ 1977 లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలీపొందారు. గిరిజనులు, పేదలు ముద్రగడకు బాగా చేరువయ్యారు. దానితో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకేసారి ఎంపీగా గెలుపొందారు. బలమైన నాయకుడిగా ఎదిగారు.
1994లో కాపుల కోసం నిరాహారదీక్ష చేసి, ప్రభుత్వం కాపు విద్యార్థుల కోసం స్పెషల్ జీవో తీసుకువచ్చేలా కృషి చేసారు. ఆపై చంద్రబాబు నాయుడి ప్రభుత్వంతో కాపు రిజర్వేషన్ల కోసం ప్రయత్నించగా ఊరించి ఊరించి ఉసూరుమనిపించే బాబు ముద్రగడను పలుమార్లు కాపు రిజర్వేషన్లు ఇదిగో అదిగో అంటూ ఊరించి వాడుకుని వదిలేసారు. ఆపై 2016లో కాపు ఐక్యగర్జన సభ సందర్భంగా వచ్చిన వేలాదిమంది కాపులకు ఉద్యమపిలుపుని ఇవ్వడంతో వారంతా ఒక్కసారిగా రాస్తారోకోలు, రైల్రోకోలు చేయడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసారు.
ఇప్పుడు పవన్ చంద్రబాబు తో కలిసి చేస్తన్న పొత్తు రాజకీయం నచ్చని కాపులు, కాపు నేతలూ… జోగయ్య పాటిస్తున్న నిశ్శబ్దం వల్ల స్తబ్దుగా ఉండిపోయిన కాపులు ఇప్పుడు ఆశగా తమ ఉనికి చాటేందుకు పాటు పడే ముద్రగడ వైపే చూస్తున్నారు. ఈ సమయంలో ముద్రగడ వైసిపీకి తమ మద్దతు తెలపడంతో కాపు ఓట్లన్నీ వైసిపీకి మళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.