ఎన్నికల వేల ఊహాగానాలతో హాట్ టాపిక్ గా మారిన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి వ్యవహారానికి ఎట్టకేలకి ఎండ్ కార్డ్ పడింది. నెల్లూరు ఎంపీగా, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వైసీపీ పార్టీ తరుపున భాద్యతలు నిర్వహిస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తాను వైసీపీ పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
గడిచిన ఏడాది నుంచి ఒకటే మాట చెబుతున్నా.. పనికట్టుకుని కొంతమంది తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దయచేసి వాటిని ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్ గారు తనని ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయటానికి సిద్దంగా ఉన్నట్టు ప్రకటించారు. తదుపరి విషయాలు పార్టీ అధినేత జగన్ గారిని కలిసిన తర్వాత పూర్తి వివరాలు ఇస్తానని ఆయన మీడియ ముఖంగా స్పష్టం చేశారు..
దీంతో గత కొద్ది రోజులుగా ఆదాల పార్టీ మారుతున్నారంటూ, టీడీపీతో సంప్రదింపులు జరుగుతున్నాయంటూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారానికి తెర పడ్డట్టు అయ్యింది. ఒక్క ఆదాల పైనే కాకుండా నెల్లూరు జిల్లాని బేస్ గా ఇంకా మరికొంత మంది వైసీపీ నేతల పై జరుగుతున్న దుష్ప్రచారానికి వరసగా చెక్ చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి .