తిరుపతిలో 532 ఎకరాలలో కొత్తగా నిర్మించిన ఐఐటీ , ఐసర్ శాశ్వత క్యాంపస్ ను ఇవాళ మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రారంభించనునారు . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా విజయవాడ నుంచి వర్చ్యువల్ గా పాల్గొననున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఐఐటీ , ఐసర్ ప్రకటించగా 2015 మార్చి 15న కేంద్ర మానవ వరుల మంత్రి స్మ్రితి ఇరానీ శంకుస్థాపన చేశారు.
కాంపస్ లు అప్పుడే ప్రారంభం అయ్యినా కూడా నాటి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా శాశ్వత భవనాల నిర్మాణానికి నోచుకోక తాత్కాలికంగా చదలవాడ ఇంజనీరింగ్ కళాశాలలో తరగతులు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినాక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో శాశ్వత క్యాంపస్ కు అవసరమైన అన్ని బిల్డింగ్లు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధం అయింది . ఈ ప్రారంభ కార్యక్రమాలలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి , సంబంధిత అధికారులు కళాశాల ప్రాంగణంలో పాల్గొనన్నునారు.