ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద చెత్త చంద్రబాబేనని మంత్రి సీదిరి అప్పలరాజు మండి పడ్డారు. మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన సీదిరి అప్పలరాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే..
శ్రీకాకుళంలో చంద్రబాబు రా.. కదలిరా అంటూ సభలు నిర్వహిస్తున్నారు. ఓపక్క రా.. కదలిరా సభల్లో చంద్రబాబు మాట్లాడుతుంటే మరోపక్క జనం వెళ్లిపోతున్నారు. ప్రజలు చంద్రబాబు ప్రసంగాలు వినలేక వెళ్లిపోతున్న దృశ్యాలు చూస్తుంటే ఆయనను ప్రజలు ఎంతగా నమ్ముతున్నారో అర్ధమవుతుంది. కొత్తగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తానంటున్న చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు ఏం చేసాడు?. ఉద్దానంలో చావులకు కారణమై ఉద్దానాన్ని స్మశానంగా మార్చిన ఘనత చంద్రబాబుదే అంటూ మంత్రి అప్పలరాజు దుయ్యబట్టారు.
ఉత్తరాంధ్రకు సీఎం జగన్ పరిపాలన రాజధానిని ఇస్తే కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో పేదరికం తగ్గింది. సీఎం జగన్ నిజంగా పేదలకు నాయకుడు. చంద్రబాబు పెత్తందారులకు నాయకుడు. పెత్తందారుల నాయకుడు కాబట్టే తన సామాజిక వర్గానికి చెందిన 22 మంది టీడీపీ అభ్యర్థులకి టికెట్లు కేటాయించడంపై మంత్రి మండిపడ్డారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబుది నోరా మూసీనదా? అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు చంద్రబాబును ఎండగట్టారు.