వాలంటీర్ల సేవలు ప్రపంచానికే ఆదర్శం : ఫిరంగిపురం సభలో మాజీ మంత్రి మేకతోటి సుచరిత
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎక్కడ లేని విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకే తీసుకొని వెళ్ళింది సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అని, అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఒకేసారి 1,35,000 మందిని సచివాలయ సిబ్బంది ఏర్పాటు చేయడమే కాకుండా సచివాలయాలకు అటాచ్ చేస్తూ గ్రామ , వార్డ్ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి 50 ఇళ్ళకి ఒకరు చెప్పిన ఏర్పాటు చేసి మొత్తంగా 2,55,000 మంది వాలంటీర్లును నియమించింది ఈ ప్రభుత్వం అని ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోట సుచరిత అన్నారు. వలంటీర్లను గుర్తించి వారి ద్వారా అందిస్తున్న సేవలు ప్రపంచానికే ఆదర్శం, చంద్రబాబు అనేక మాటలు చెప్పి మాట తప్పిన విషయం అందరికీ తెలుసు, మీరు ఈ వలంటీర్ వ్యవస్ధ తీసుకొచ్చినప్పుడు అనేకమంది అవాకులు చవాకులు మాట్లాడారు, ఇప్పుడు అదే నోటితో పొగుడుతున్నారు, అది కదా పాలన అంటే…గతంలో వలంటీర్లను ఇంటికి రానివ్వడానికి జంకేవారు కానీ ఇప్పుడు మా అమ్మాయి, అబ్బాయి అని మాట్లాడుతున్నారు, సూర్యుడి కంటే ముందు తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నారు, కోవిడ్ సమయంలో వలంటీర్లు సైనికుల్లా సేవలందించారు, వారి సేవలకు గర్వపడుతున్నాం, ఈ రోజు పెద్దలెవరికైనా బాగులేకపోతే బిడ్డలకు ఫోన్ చేసినా చేయకపోయినా వలంటీర్కు చేసి అడుగుతున్నారు, ఒక వలంటీర్ను స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఘనత మీదే అని, మన దేశం హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం చూసింది కానీ మన రాష్ట్రానికి ఉద్యోగ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి మీరే, కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ఉద్యోగాలు కల్పించారు అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్దేశించి మేకతోటి సుచరిత మాట్లాడారు.
ఇదే సభలో ఫిరంగిపురం మండలం, గొల్లపాలెం వలంటీర్ దాసరి జ్యోత్స్న మాట్లాడుతూ అన్నా, మీరు పాదయాత్రలో మా కష్టసుఖాలు తెలుసుకుని నేను విన్నాను, నేను ఉన్నాను అన్న మాటకు కట్టుబడి సీఎం అయిన తర్వాత వలంటీర్ వ్యవస్ధను ఏర్పాటుచేసి రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్ళారు. నాకు కేటాయించిన 64 కుటుంబాలలో ఏ కుటుంబం ఏ పథకానికి అర్హులో గుర్తించి వారికి ఆ పథకం అందించేటప్పుడు వారి మొహాల్లో ఆనందం, పెదాలపై చిరునవ్వు చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, ప్రతి నెలా ఫించన్ ఇచ్చేటప్పుడు అవ్వాతాతలు మా పెద్దకొడుకుకు మా దీవెనలు ఉంటాయని మా చేతులు తాకినప్పుడు ఉండే అనుభూతి మరిచిపోలేం. నా పరిధిలో వృద్దాప్య ఫించన్ తీసుకునే తాత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఒకటో తారీఖు నేను రాత్రి 12 వరకు ఆయన దగ్గర కూర్చుని యాప్ ఓపెన్ అవగానే ఆయనకు ఫించన్ ఇచ్చాను, ఆ తర్వాత 2,3 గంటలకు దురదృష్టవశాత్తూ ఆయన చనిపోయారు, అప్పుడు తన భార్య వచ్చి నన్ను హత్తుకున్నప్పుడు ఇది కదా సేవ అని అనిపించింది, మన ప్రభుత్వంలో రైస్ కార్డులు ఇచ్చినప్పుడు వారు పొందే ఆనందం అంతా ఇంతా కాదు, ప్రతి నెలా రైస్ తీసుకుంటూ అక్కా మీ వల్లే మాకు సాధ్యమైందనేటప్పుడు సంతోషంగా ఉంటుంది. తల్లి గర్భంలోని శిశువు నుండి వృద్దాప్యం వరకు ప్రతి ఒక్కరికీ… వారికి సంక్షేమ పథకాలు అందించే సీఎంను ఎవరు వదులుకుంటారు, ఇన్ని పథకాలు ఇస్తున్న సీఎంగారి వైపు, మన రాష్ట్రం వైపు చూడకుండా ఎవరైనా ఉంటారా, అందుకే మీరు ప్రజల గుండెల్లో ప్రత్యక్ష దైవమయ్యారు, మేం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని మా వలంటీర్ల తరపున హామీ ఇస్తున్నాను, ప్రజలు మీ కోసం సిద్దంగా ఉన్నారన్నా, మీ పాలన కోసం మళ్లీ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అంటూ ధన్యవాదాలు తెలిపింది.
ఫిరంగిపురం మండలం బేతపూడి వలంటీర్ షేక్ జుబేర్ మాట్లాడుతూ అన్నా, నా క్లస్టర్ లో 62 కుటుంబాలు ఉన్నాయి, అన్ని కుటుంబాలకు మీ పథకాలు అందాయి, మీరు పాదయాత్రలో అందరికీ భరోసా ఇచ్చారు, మీరు మీ మాట నిలబెట్టుకున్నారు, మీరు 2,62,000 మంది వలంటీర్ సైన్యాన్ని సిద్దం చేశారు, మీ ఆశయాలను నిలబెట్టేలా మేం పనిచేశాం, గతంలో సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా ఉండేవి, కానీ ఈ రోజు ప్రతి గడప తొక్కి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తున్నారు, అన్నా నా పరిధిలో 22 ఏళ్ళ యువకుడు కూలి పనులకు వెళ్ళి 4 వ అంతస్ధు నుంచి కిందపడి చావు అంచులవరకూ వెళ్ళాడు, కానీ ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకూ ఉచిత వైద్యం సంజీవనిలా పనిచేసింది, అతని కుటుంబానికి ఆరోగ్య ఆసరా నెలకు రూ. 5,000 చొప్పున రెండునెలలకు రూ. 10 వేలు ఇచ్చాం, నా పరిధిలో ఉన్న వారికి ఫించన్లు ఇచ్చేటప్పుడు సంతోషంగా పండుగలా తీసుకుంటున్నారు, మీ చిరునవ్వు మాకు ఆత్మస్ధైర్యాన్ని ఇస్తుంది, ఈ వలంటీర్ వ్యవస్ధను మొదట్లో చాలా కించపరిచి మాట్లాడారు, కానీ మీరు మాకు అండగా నిలిచి ఇచ్చిన ధైర్యం మాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది, మీరు నా వలంటీర్లు అంటూ అన్న ప్రతి సారి మాకు రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేశాం, మేం ఈ జన్మలో మరిచిపోలేం, మాలోని ప్రతిభను గుర్తించి మాకు ఇచ్చే ఈ అవార్డులను పెంచడం చాలా సంతోషంగా ఉంది, అన్నా మీ పాలనలో మరోసారి మేము పనిచేయడానికి సిద్దం, మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం, మా వలంటీర్ కుటుంబ సభ్యులందరి తరపునా మీకు ధన్యవాదాలు అని తెలిపాడు.