మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీ లో ప్రతీ సంవత్సరం జరిగే వేడుకల్లో భాగంగా నిన్న జరిగిన సమావేశంలో మోహన్ బాబు సన్నిహితులు,స్నేహితులు,సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ రంగాల్లో చర్చలకు తావునిచ్చింది.
వివరాల్లోకి వెళితే వేడుకలో భాగంగా తన స్పీచ్ ను ముగిస్తూ మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, జాగ్రత్తగా మీ నాయకుడిని ఎన్నుకోండి,మనుషులను ప్రాంతాలను విడదీసే వారిని దూరంగా ఉంచండి.. అలాగే కుటుంబాలను విడదీసే వారిని సైతం రాజకీయంగా ఎంకరేజ్ చేయొద్దు, నేనే ఉండాలి నేనొక్కదాన్నే అనే స్వభావం ఉన్న వాళ్లని అసలు నమ్మొద్దు అంటూ పరోక్షంగా చురకలు అంటించారు..
ఈ విమర్శలు రెండూ ఒకటి చంద్రబాబు ను దృష్టిలో ఉంచుకుని, మరొకటి భూమా అఖిల ప్రియను దృష్టిలో ఉంచుకుని చేసినట్లు సులువుగా అర్థం అవుతుంది… హెరిటేజ్ విషయంలో ఎప్పటి నుండో బాబు కు, మోహన్ బాబుకు మధ్య వివాదం నడుస్తుంది. తన వాటా షేర్ లను తనకు ఇవ్వకుండా బాబు మోసం చేసాడని తరచూ మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే వారిని నమ్మొద్దు అని మనోజ్ వ్యాఖ్యానించింది కూడా బాబునే, మూడు రాజధానులకు వ్యతిరేకంగా, కేవలం ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాలని బాబు బావించడం కుటుంబాలను విడదీసి పాలించడం,అన్ని ప్రాంతాలను ఒక మాదిరిగా చూడకుండా ఒక ప్రాంత అభివృద్ధికి మాత్రమే తాపత్రయ పడే చంద్రబాబు లాంటి కుటిల రాజకీయ నాయకుడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది,రాష్ట్రం అంత బాగుపడుతుంది అని తన మాటలతో యువతకు ఒక చక్కని సూచన చేశాడు మంచు మనోజ్.
ఇక కుటుంబాలను విడదీసే వారిని సైతం రాజకీయంగా ఎంకరేజ్ చేయొద్దు అంటూ తన భార్య మౌనిక అక్క అయిన భూమా అఖిల ప్రియకు కూడా చురకలు వేశాడు రాజకీయం నేనే చేయాలి కుటుంబంలో నా పేరే వినపడాలి అనే రాజకీయ కాంక్షతో తన భార్య మౌనికతో సహా భూమా వారసులను అందరినీ పక్కన పెట్టిన అఖిలను కూడా సుతిమెత్తగా ప్రస్తావించాడు…