నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుందన్న చందాన అగ్ర కులాల అమ్మాయిలను లే*కు రండి నేను పారితోషికం ఇస్తాను, ఫలానా కులం వాళ్లంతా దోపిడీ పరులే అంటూ రాయలేని భాషలో తన యూట్యూబ్ ఛానెల్ లో ఒకప్పుడు నోటికి వచ్చింది మాట్లాడిన మహాసేన రాజేష్ ఇప్పుడు కొత్తగా సింపతీ డ్రామాకి తెరలేపారు. తన వల్ల పార్టీకి అధినేతకు నష్టం కలుగుతుందంటే తాను పోటీ నుండి తప్పుకోవడానికి కూడా సిద్దమే అంటూ చిలక పలుకులు పలుకుతుండడం చూసి ప్రజలు ఔరా అని ముక్కున వేలేసుకుంటారు.
వాస్తవానికి టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో మహాసేన రాజేష్ కి పి.గన్నవరం టికెట్ కేటాయిస్తారని ఎవరూ ఊహించలేదు. చంద్రబాబు మహాసేన రాజేష్ పేరు ప్రకటించగానే అందరూ ఆశ్చర్య పోయారు. కానీ ఆ తర్వాతే మొదలైంది అసలు ఆట. మహాసేన రాజేష్ గతంలో పలు కులాలను మతాలను దూషించిన వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు సరిపెల్ల రాజేష్. ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తుందని తెలియక చేసిన వీడియోలన్నీ వైరల్ కావడం ఇలాంటి వ్యక్తికా చంద్రబాబు టికెట్ ఇచ్చిందని పలువురు వ్యాఖ్యానిస్తుండడం సరిపెల్ల రాజేష్ కి మింగుడుపడని అంశంగా మారిపోయింది.
ఇప్పటికే రాజేష్ కి టికెట్ ఇచ్చినందుకు బ్రాహ్మణ సంఘాలు తాము ఓటు వేయబోయేది లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అదే విధంగా తమ కులాలను దూషించాడని, మతాన్ని కించపరిచాడని పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టిన మహాసేన రాజేష్ తన వల్ల చంద్రబాబుకి, పార్టీకి నష్టం కలుగుతుందంటే ఎమ్మెల్యే సీటును వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ తన ఛానెల్ లో ప్రకటించాడు. వాస్తవానికి అలా తప్పుకుంటాను అంటే సింపతీ వర్కౌట్ అయి,ఎవరో కామెంట్ చేసారని నువ్వు పోటీకి దూరం కావడం ఎందుకు? నువ్వే పోటీ చేయి నీ వెనుక మేముంటామని ప్రజలతో పాటు చంద్రబాబు అనే అవకాశం ఉందని అందుకే ఈ కొత్త డ్రామాకు తెరతీసాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా చేసిన ఖర్మ ఫలితం వదిలిపెట్టదని మహాసేన రాజేష్ ఉదంతం చూస్తే అర్థం అవుతుంది.