ఎవరూ ఊహించని రాజకీయ ప్రయాణం రాజేష్ మహాసేనదని నిరభ్యంతరంగా చెప్పవచ్చు. తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి తరువాత జనసేనకు దగ్గరై ఆ పార్టీలో చేరుదాం అనే సమయానికి యూ టర్న్ తీసుకుని లోకేష్ కి దగ్గరై టీడీపీలో చేరిన మహాసేన రాజేష్ అనూహ్యంగా పి. గన్నవరం అభ్యర్థిగా టీడీపీ తరపున సీటు దక్కించుకున్నారు. కేవలం అసభ్యకరమైన పదజాలం వాడటమే ప్రామాణికంగా రాజేష్ మహాసేనకి సీటు ఇచ్చారనే వాదనా లేకపోలేదు.
కాగా ఎప్పుడైతే మహాసేన రాజేష్ కి సీటు ఇచ్చారో ఒక్కసారిగా పి . గన్నవరం నియోజకవర్గంలో కుమ్ములాటలు మొదలయ్యాయి. గతంలో రాజేష్ మహాసేన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, కుల మతాల దూషణలు ఆయన పాలిట గుదిబండగా మారాయి. రాజేష్ కి సీటు ఇస్తే మేము పనిచేయమని బ్రాహ్మణ సంఘాలతో పాటు అక్కడ కేడర్ ఎదురుతిరిగింది. దీంతో తనకు టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబుకు చెడ్డపేరు వస్తుందంటే తాను పోటీ నుండి తప్పుకోవడానికి సిద్దమే అంటూ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు మహాసేన రాజేష్. వాస్తవానికి పోటీ నుండి తప్పుకుంటున్నానని ప్రకటిస్తే సింపతీ వస్తుందని ఆశించగా ఆ ఆశలు అడియాసలయ్యాయి.
రాజేష్ పోటీనుండి తప్పుకుంటానని ప్రకటించినా టీడీపీనుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో పి.గన్నవరంలో తిరిగి తన ప్రచారాన్ని ప్రారంభించాలని మహాసేన రాజేష్ అనుకుంటుండగా అటు టీడీపీ శ్రేణులు కానీ ఇటు జనసేన కేడర్ నుండి కానీ కనీస స్పందన కరువవడంతో ఎటూ పాలుపోని స్థితిలో రాజేష్ మహాసేన కూరుకుపోయాడు. తాజాగా రాజేష్ ని ఓ వర్గం మీడియా టీవీ డిబేట్లకు ఆహ్వానించకపోవడం ఇప్పుడు రాజేష్ కి ఇబ్బందికరంగా మారింది. ఎల్లో మీడియాలో ఎప్పుడూ ఏదొక డిబేట్ లో పాల్గొంటూ పబ్బం గడుపుతున్న రాజేష్ కి కొద్దిరోజుల నుండి పిలుపు రాకపోవడం ఒకవేళ రాజేష్ ఫోన్ చేసినా సదరు టీవీ సంస్థలు ఫోన్ కి స్పందించకపోవడంతో తనను పక్కనబెట్టారన్న విషయం రాజేష్ కి అర్ధమై లోలోపల కుమిలిపోతున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు తనను కూడా టిష్యు పేపర్ లా వాడుకుని వదిలేసాడని రాజేష్ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు సమాచారం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని రాజేష్ ఉదంతం చూసిన పలువురు వ్యాఖ్యానిస్తుండటం విశేషం..