తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు తెలిసింది ఒకటే. తాను చేయని పనిని చేశానని చెప్పుకొంటాడు. అది ఒకటి, రెండుసార్లు కాదు. నేనే.. నేనే అని పదే పదే చెప్తాడు. సీఎంగా రాజశేఖరరెడ్డి ఎన్నో ప్రాజెక్టులు తెచ్చి అభివృద్ధి చేస్తే సిగ్గులేకుండా నేనే చేశానంటాడు బాబు. హైదరాబాద్, ఐటీ విషయాల్లో అంతే. హైదరాబాద్కు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ప్రతి మీటింగ్లో ఆ నగరాన్ని నేనే కట్టానని, అభివృద్ధి చేశానని నారా వారు చెబుతుంటారు. గత 20 సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. టీడీపీ నాయకులు ఆయనకు వంత పాడుతుంటారు. ఎల్లో మీడియా జనం మెదళ్లలోకి అదే ఎక్కిస్తుంది. హైదరాబాద్ చరిత్ర గురించి చాలామందికి తెలుసు. అయినా బాబు పట్టించుకోరు. ఆ నగరం నా సృష్టేనంటారు. ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్, ఇతర తెలంగాణ నాయకులు ఎంతో తిట్టినా ఆ ప్రచారం మాత్రం ఆగలేదు. ఆదివారం నెల్లూరు, పత్తికొండలో రా కదలిరా సభలు జరిగాయి. రెండుచోట్ల బాబు దాదాపు ఒకటే పాఠం చదివారు. పత్తికొండలో మాట్లాడుతూ ఐటీని ప్రోత్సహించా.. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డు నాదంటూ ఊదరగొట్టారు. నెల్లూరులో కూడా హైదరాబాద్ నగరం కట్టింది తానేనని, అది దేశంలోనే బ్రహ్మాండంగా ఉందంటే.. కారణం తాను వేసిన ఫౌండేషన్ అని ఎప్పుడూ చెప్పే మాటలు చెప్పారు. తర్వాత వచ్చిన సీఎంలు నా ఫౌండేషన్ను కొనసాగించారని, దాని ఫలితాలను ప్రజలు అనుభవిస్తున్నారంటూ లేని గొప్పల్ని మరోసారి రుద్దే ప్రయత్నం చేశారు. వాస్తవానికి హైదరాబాద్లో ఐటీకి పునాది రాయి వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది జగమెరిగిన సత్యం. కానీ టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా అది చంద్రబాబు ఘనతగా ప్రచారం చేస్తుంటాయి. ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూడటం కంటే.. అధికారంలో ఉన్నప్పుడు మంచి పనులు చేస్తే జనమే ఫలానా ప్రాజెక్టు ఆయన తెచ్చారు.. ఫలానా పని ఆయన చేశారని చెప్పుకొంటారు కదా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు బాబూ..