అప్పటికి ఉచిత విద్యుత్ అనే పథకం లేనే లేదు… పైపెచ్చు అధిక టారిఫ్ ధరలు ఉన్నాయి, పలుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి నడ్డి విరిచాడు కూడా… ఇక విషయానికి వస్తే విద్యుత్ అక్రమ వాడకాన్ని నిరోధించాలి అనే పేరుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు తప్పనిసరిగా పెట్టే విధంగా అధికారులతో మంతనాలు జరిపాడు…
కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతుండగా ఉచిత విద్యుత్ కి ఎగనామం పెట్టడానికి అంటూ విమర్శిస్తున్న లోకేష్, వాటిని పగలకొట్టండి అంటూ టీడీపీ కార్యకర్తలకి పిలుపివ్వడం విదితమే. అయితే కేంద్రం నుండి ఎలాంటి సూచనలు, ఆదేశాలు ఇవ్వకుండానే 1996 లోనే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు .
అప్పటికి ఉచిత విద్యుత్ అనే పథకం లేనే లేదు… పైపెచ్చు అధిక టారిఫ్ ధరలు ఉన్నాయి, పలుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి నడ్డి విరిచాడు కూడా… ఇక విషయానికి వస్తే విద్యుత్ అక్రమ వాడకాన్ని నిరోధించాలి అనే పేరుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు తప్పనిసరిగా పెట్టే విధంగా అధికారులతో మంతనాలు జరిపాడు… మీటర్లు బిగించడానికి మొదటిదశలో 100-120 కోట్లు ఖర్చు అవుతుందని, మీటర్లు బిగించాక వచ్చే ఆదాయంతో పోలిస్తే అదేం పెద్ద విషయం కాదని కూడా చర్చించుకున్నారు అంటే బాబు ఏ స్థాయిలో రైతుల నడ్డి విరవాలని పూనుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.. ఆ తర్వాత కాలంలో కరెంటు బిల్లు బకాయిలు కట్టలేని రైతుల పై క్రిమినల్ కేసులు పెట్టించిన ఘన చరిత్ర బాబు సొంతం.
ఆ తరువాత 1999 లో, 2004 ఎన్నికల వేల వైఎస్సార్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చినప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడమే అని ఎగతాళి చేసిన ఘనత కూడా బాబుదే.
ఈరోజు ఉచిత విద్యుత్ ఇస్తూనే, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయరంగంలో వినియోగించబడుతున్న విద్యుత్ ఏమేరకు ఉంటుందోనని అంచనాకోసం మీటర్లు బిగించాలని ప్రభుత్వం యోచిస్తుంటే, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అని వ్యాఖ్యానించిన బాబు తనయుడు లోకేష్ ఇవాళ ఆశ్చర్యకరంగా మీటర్లు బిగించేది ఉచిత విద్యుత్ కి ఎగనామం పెట్టడానికే అని విమర్శించడం హాస్యాస్పదం…