2018 అక్టోబర్ 25 నాటి ప్రతిపక్ష నేత, నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగించుకొని హైదరాబాద్ వెళ్తున్న సమయం లో వైజాక్ ఎయిర్పోర్ట్ లోని ఫ్యూజన్ ఫుడ్స్ అనే రెస్టారెంట్ లో పనిచేస్తున్న జునుపల్లి శ్రీనివాసులు కోడికత్తితో జగన్ పై హత్యాయత్నం చేశాడు . అదృష్టం కొద్దీ భుజానికి గాయంతో బయటపడ్డాడు జగన్ .
ఇంకా ఈ సంఘటన విమానాశ్రయంలో జరిగింది కాబట్టి ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణను చేపట్టి ఉద్దేశ పూర్వకంగానే దాడికి పాల్పడ్డాడు అని బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఐఏ కోర్ట్ ని కోరింది. దర్యాప్తు సంస్థ పొందుపరిచిన వివరాలు పరిశీలించిన తర్వాత ఎన్ఐ ఏ కోర్ట్ బెయల్ నిరాకరించింది. దీంతో అతను హైకోర్టు ను ఆశ్రయించాడు. ఈ వ్యాజం పై జస్టిస్ ఉప్మాక దుర్గ ప్రసాద్, జస్టిస్ మండవ కిరణ్మయిల బెంచ్ లలో ఇరుపక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. మంగళవారం ఈ వ్యాజ్యం మళ్ళీ బెంచు ముందుకు రాగా ఇంకా ఈ కేసు లో వాదనలు వినిపించేందుకు అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహాశర్మ హాజరు కావాల్సి ఉందని వాదనలను వాయిదా వేయాలని ఎన్ఐఏ తరుపు న్యాయవాది జూపూడి యజ్ఞాధత్ గౌరవ హైకోర్టు కి తెలిపారు, దీనికి జూనుపల్లి శ్రీనివాసరావు తరపున న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు, పిటిషనర్ జైలులో నిరాహారదీక్ష చేస్తున్నాడు అని అత్యవసర వాదనలు వినాలని కోర్ట్ ని అభ్యర్థించారు. దీని పై ధర్మాసనం ఆసహనం వ్యక్తం చేస్తూ నిరాహారదీక్షలు పేరుతో కోర్టులు పైన ఒత్తడి తేవద్దని మందలించింది. కేసు సాంద్రతను బట్టి విచారణ ఉంటుంది అని కోర్ట్ తెలిపింది, అత్యవసర విచారణ చేపట్టడానికి నిరాహారదీక్ష ఎంత మాత్రం కారణం కాకూడదు అని కోర్ట్ వ్యాఖ్యనించింది, తదుపరి విచారణను బుధవారం కి వాయిదా వేసింది.