నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్తో భేటీ అయ్యారని కొన్ని వార్తలు వచ్చినా అధికారికంగా ధ్రువీకరించలేదు . కానీ వైసిపిని వీడనున్నారు అని ఆ రోజు నుండే చర్చలు జరుగుతుండగా ఈ రోజు వైసీపీకి రాజీనామా ప్రకటించారు .
విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య కుమారుడైన కృష్ణదేవరాయులు గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువకుడు, రాజకీయాలకు కొత్తవాడు అయినా ఆయనకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నరసరావుపేట పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చి సముచిత స్థానం కల్పించారు. నాడు జగన్ హవాలో టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై 1,53,978 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
ప్రస్తుతం సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా నరసరావుపేట పార్లమెంట్ స్థానం వేరే వారికి కేటాయించాలని నిర్ణయించిన అధిష్టానం, కృష్ణ దేవరాయలకు వేరే స్థానం ఆఫర్ చేయగా తనకు నరసరావుపేట నుండి మాత్రమే కావాలని పట్టుబట్టిన ఆయన అధిష్టానం నిరాకరించడంతో పార్టీని వీడుతున్నట్టు ఈ రోజు ప్రకటించారు.
ఈ నిర్ణయం తొందరపాటు చర్యగా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణదేవరాయలు 2019లో జగన్ హవాలో ఎంపీ అయ్యారే కానీ స్వయంగా రాజకీయ బలం వున్న వ్యక్తి కాదని, ఆయన తండ్రి రత్తయ్య కూడా రాజకీయాల్లో చేరి ప్రజాప్రతినిధి కావాలని దీర్ఘ కాలం తీవ్రంగా ప్రయత్నించారు కానీ నెరవేరలేదని పలువురు సీనియర్లు గుర్తు చేసుకోవటం విశేషం .
తన కుటుంబం నుంచి రాజకీయంగా ఎదగాలన్నది విజ్ఞాన్ లావు రత్తయ్య కల, 1995 ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటన తర్వాత చంద్రబాబును గట్టిగా వ్యతిరేకించారు లావు రత్తయ్య, 1996 ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి పార్టీ తరఫున పోటీచేశారు ఓడిపోయారు
2009లో మల్కాజ్గిరి నుంచి లోక్సత్తా తరఫున పోటీచేశారు ఓడిపోయారు, ఇలా నాలుగు దశాబ్దాలుగా ఆయన కల నెరవేరలేదు, ఎట్టకేలకు వైయస్.జగన్ ద్వారా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా లావు కుటుంబం కల నెరవేరింది, 2019 ఎన్నికల్లో నర్సారావుపేట నుంచి ఎంపీగా పోటీచేసిన లావు 1,53,978 ఓట్లతో గెలిచారు
1989 నుంచి జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇంత మెజార్టీ ఏ పార్టీకీ రాలేదు, కేవలం వైఎస్ జగన్ హవా కారణంగానే ఈ భారీ మెజారిటీ సాధ్యమయ్యిందని ప్రపంచం మొత్తం తెలుసు.
గెలిచిన తర్వాత ఐదేళ్లలో తన కులం వాళ్లకే పెద్దపీట వేస్తూ,
రెండు పడవలమీద ప్రయాణానికే మొగ్గు చూపిన కృష్ణ దేవరాయలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మర్రిరాజశేఖర్ను, వినుకొండ నుంచి మక్కెన మల్లికార్జునరావును, ఇలా వైయస్సార్సీపీలో ఉన్న కమ్మ నాయకులను గంపగుత్తిగా టీడీపీలోకి తీసుకెళ్లే ప్రయత్నం
దీన్ని మొదటే గమనించిన పార్టీ వేచి చూసి చివరిగా అతను నరసరావుపేటలో టికెట్ ఇచ్చినా వ్యతిరేకంగా పని చేస్తాడని నిర్ధారణకి వచ్చిన వైసీపీ అధిష్టానం పేట టికెట్ బీసీ వర్గానికి ఇవ్వటానికి నిర్ణయించి, రత్తయ్య పై గౌరవంతో మరో స్థానంలో పని చేసుకోమని కృష్ణ దేవరాయలకు సూచించారు. అప్పటినుంచే దూకేందుకు సిద్ధంగా ఉన్న లావు కృష్ణదేవరాయలు ఈనెల 18న చంద్రబాబును, లోకేష్ను, ఏబీఎన్ రాధాకృష్ణను కలిసి టీడీపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకొన్నారు.
ఇలా రత్తయ్య కుమారుడికి పార్టీ అన్ని విధాలుగా అండగా నిలిచి అవకాశాలు కల్పించినా . నేడు పార్టీని వీడడం పై ఇన్నాళ్ళూ అండగా ఉన్న ఆయన వర్గీయులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లావు ఏ హామీతో టీడీపీలో చేరుతున్నారో గానీ.. చంద్రబాబు, లోకేశ్లు ఎవరినైనా వాడుకుని కరివేపాకుల్లా తీసి పారేస్తారని తెలుసుకునేందుకు ఆయనకు పెద్దగా సమయం పట్టకపోవచ్చు.