వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి 2019 లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉన్న వనరులకు అనుగుణంగా అనేక పెట్టుబడులను ఆకర్షించాడు. అందులో భాగంగా మొదట అభివృధి పోర్టులు పైన పెడితే , రెండో అంశం గా గ్రీన్ ఎనర్జీ పైన దృష్టి సారించాడు. అందులో భాగంగా గతంలో జరిగిన విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సుమ్మిట్లో దాదాపు 13 లక్షల కోట్లకు సంబంధించి పెట్టుబడులు ఆకర్షించింది ఆంధ్ర రాష్ట్రం, అందులో భాగంగానే ఎన్టీపీసీ అనుబంధ సంస్థ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లక్ష పది వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. అందులో భాగంగా గత వారంలో 1200 ఎకరాల భూమి లీజుకు సంబంధించి ఒప్పంద పాత్రలు పైన సంతకాలు జరిగాయి.
ఎన్టీపీసీ ఆంధ్ర రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టనుంది. లక్ష 10 వేల కోట్ల నిర్మాణ వ్యయంతో దేశంలోనే అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ నిర్మించడానికి విశాఖ జిల్లాలోని అచ్యుత పురం మండలం పుడిమడక దీనికి వేదిక అయ్యింది. 2023 మార్చిలో విశాఖ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – ఎన్టీపీసీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనికి అవసరమైన 1200 ఎకరాల భూమిని లీజు ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) , ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మద్య ఒప్పంద పత్రాల పై సంతకాలు జరిగాయి. కాగా ఈ ప్రాజెక్ట్ ను 2 దశలలో పూర్తి చేయాలని ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ భావిస్తోంది. మొదటి దశను 2026 కు, రెండో దశను 2032కు పూర్తి చేయాలి అని నిర్ణయించింది. కాగా ఇక్కడ ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మెథనాల్ వంటివి ఉత్పత్తులుగా మార్చి ఎగుమతులు చేస్తాం అని ఎన్టీపీసీ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా పది వేలమందికి ఉపాధి అవకాశం లభించనుంది.