ఒకప్పుడు బాంబులు గడ్డగా పేరుపొందిన పల్నాడు జిల్లాలో ఇటువంటి వింతైన సంఘటన జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుత పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో బాంబుల శివప్రసాద్ గా పేరు పొందిన మాజీ స్పీకర్ , మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ హయాంలో టెలిఫోన్ బిల్ అడిగినందుకు బాంబులతో దాడి చేశారు.
నరసరావుపేట పట్టణంలో పల్నాడు రోడ్ లోని ఎన్టీఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎస్.టి.డి బూత్ లో కేసరి శ్రీనివాస్ రెడ్డి ఒక టెలిఫోన్ కాల్ మాట్లాడాడు, కాల్ మాట్లాడిన తర్వాత ఎస్.టి.డి బూత్ ఓనర్ మర్రిపూడి హరిబాబు టెలిఫోన్ కాల్ కు సంబంధించి బిల్లుని చెల్లించమని కేసరి శ్రీనివాస్ రెడ్డిని కోరగా తాను బిల్లు చెల్లించిన అని వాగ్వాదానికి శ్రీనివాస్ రెడ్డి దిగాడు. నన్నే బిల్లు అడుగుతావా అంటూ హరిబాబుపై దురుసుగా ప్రవర్తించాడు. వాగ్వాదం ముగిసిన తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత కేసరి శ్రీనివాస్ రెడ్డి బాంబులున్న సంచిని తీసుకొని వచ్చి ఎస్.టి.డి బూత్ పై దాడి చేశాడు. అందులో రెండు బాంబులు పేలాయి. ఈ సంఘటనను తెలుసుకున్న సీఐ గురుచరణ్ దాస్ సంఘటనా స్థలం నుంచి పారిపోతున్న నిందితుడిని వెంటాడి పట్టుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడిని విచారించగా మరికొన్ని బాంబులు ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ప్రతిపాటి కోటేశ్వరరావు ఐస్ ఫ్యాక్టరీ ఆవరణంలో దాచాను అని చెప్పాడు. పోలీస్ వారు ఆ ప్రదేశానికి వెళ్లి వెతకగా అక్కడ 17 బాంబులు దొరికాయి.
1983 నుండి 2004 వరకూ పల్నాటి గడ్డకి బాంబుల గడ్డ అని పేరు రావటం వెనక, టీడీపీలో పలు మంత్రి పదవులు చేపట్టిన ఒక నాయకుడి కృషి ఎంతో ఉంది. అంత ఘనత వహించిన ఆ నాయకుడు కుర్చీల దొంగతనం కేసులో సిగ్గు బోయి సూసైడ్ చేసుకొన్నాడు పాపం