ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీఎం జగన్ కి కంగ్రాచ్యులేషన్స్ అని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదని వెల్లడించిన కొడాలి నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే
ప్రశాంత్ కిషోర్ పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని వ్యూహాలు రూపొందించే వ్యూహకర్త అని, ప్రస్తుతం అతనికి ఏ రాజకీయ పార్టీ పని ఇవ్వడంలేదని, ఆఖరికి ఐప్యాక్ సంస్థ నుండి కూడా తన్ని తరిమేశారని ఆయనొక తీసేసిన తహసీల్దార్ అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. బీహార్ లో రాజకీయ పార్టీ పెట్టి ఎలాంటి టీమ్ & ప్రణాళిక లేకుండా పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయిన పీకే చంద్రబాబు దగ్గర ప్యాకేజి తీసుకుని లగడపాటి రాజగోపాల్ లా జోస్యం చెబుతూ ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణలో ప్రతిపక్షాలు బలంగా లేవు కాబట్టి బిఆర్ఎస్ గెలుస్తుందని పీకే చెప్పాడని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రాజస్థాన్ లో కాంగ్రెస్ మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పాడని, కానీ అక్కడ బీజేపీ గెలిచిందని, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పాడు కానీ బీజేపీ గెలిచిందని ఇక్కడ టీడీపీ గెలుస్తుందని పీకే చెబుతున్నాడు కాబట్టి ముందుగా సీఎం జగన్ కి కంగ్రాచ్యులేషన్స్ అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎక్కడా సర్వేలు చేయకుండా డబ్బులు తీసుకుని నోటికి వచ్చినట్లు చెప్పడం ద్వారా పీకే న్యూట్రల్ ఓటర్లను టీడీపీకి వేయించే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి వాళ్ళను ఏపీ ప్రజలు పట్టించుకోరని మళ్ళీ సీఎం జగన్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని మరోసారి 150 స్థానాలకు మించి ఎక్కువ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబతుందని కొడాలి నాని స్పష్టం చేశారు.