2019 లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ జగన్ మోహన్ రెడ్డి విద్య వ్యవస్థలో పెను మార్పులు సృష్టించిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ పాఠశాల విద్య వ్యవస్థలో ఇలాంటి మార్పులు జరగలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన ఈ సరికొత్త మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులకు కొత్త అంశాల పైన శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . నేటి కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతిక విద్యని, ఫ్యూచర్ స్కిల్స్ ను నేర్చుకోవాలి, తెలుసుకోవాలని సమగ్ర శిక్ష రాష్ట్ర డైరెక్టర్ బి. శ్రీనివాస రావు తెలిపారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఇంటరాక్టివ్ పానెల్స్, బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లు , స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్ల వినియోగం, వీటిపైన అవగహన కల్పించడానికి అగస్త్య ఇంటర్నేషనల్ పాండేషన్ (గుడిపల్లి) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ తరుగతులను ఏర్పాటు చేసింది, ఇక్కడ అన్ని అంశాలుపైన సమగ్రంగా శిక్షణ కల్పించనున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విధిగా తమ పాఠశాలలోని సహచర ఉపాధ్యాయులకు శిక్షణా ఇవ్వాల్సి ఉంటుంది.
గడిచిన రెండు నెలలుగా 520 మందికి విడతల వారీగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్పై ప్రత్యేక వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పుడు 7వ బ్యాచ్లో 90 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందుతున్నరు. ఈ శిక్షణలో భాగంగా నైపుణ్యాల ప్రాధాన్యత, బోధన పరికరాలు తయారుచేయు విధానం, నిర్మాణాత్మక విధానాన్ని తరగతి గదిలో ఎలా అమలు చేయాలి, విద్యార్థులకు ఆచరణాత్మక, సాంకేతిక నైపుణ్యాలు ఎలా ఇవ్వాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. పాఠ్య ప్రణాళిక వంటి అంశాలపై ఉపాధ్యాయులకు తర్పీదునిస్తున్నామన్నారు.
ఉపాధ్యాయలు తమ బోధనలో భాగంగా పాఠశాలల్లో అందుబాటులో ఉన్న అటల్ టింకరింగ్, స్టెమ్, పాల్యాబ్స్ వినియోగించు కోవాలని సూచించారు. సాంకేతిక విద్య, ప్యూచర్ స్కిల్స్ పైన మరింత ఆవగాహన పెంచుకోవాలి అని సమగ్ర శిక్ష రాష్ట్ర డైరెక్టర్ బి. శ్రీనివాస రావు 7వ బ్యాచ్ ప్రారంభ సమయంలో ఉపాధ్యాయులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాదికారి దేవరాజ్, సమగ్రశిక్ష ఏపిసి పెద్దిరెడ్డి వెంకట రమణా రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి ఆర్.వి. రమణ, అగస్త్య అకడమిక్ డైరెక్టర్ రవీంద్రనాథ్, కోఆర్డినేటర్ పుష్ప, రిసోర్స్ ట్రైనర్స్ నాగరాజు, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.