మాచర్ల తెలుగుదేశం ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మా రెడ్డి అనుచరులు మరోసారి బరితెగించారు . జూలకంటిని మాచర్ల టీడీపీ ఇంచార్జ్ గా ప్రకటించిన నాటి నుండి వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నియోజకవర్గ ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా వరుస దాడులు, దొమ్మిలతో రెచ్చిపోతున్న జూలకంటి అనుచరులు ఈ రోజు మరో దౌర్జన్యానికి తెగ బడ్డారు.
మాచర్ల పట్టణం 28వ వార్డులో రేపు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఉండటంతో ప్రతి ఇంటి ముందు జెండాలు కట్టారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించి వారి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అలాగే ఆ వార్డ్ వైసీపీ కౌన్సిలర్ ఇంటి ప్రాంగణంలో కూడా టీడీపీ జెండా కట్టి స్టిక్కర్లు అంటించడంతో వార్డు కౌన్సిలర్ తో పాటు ఆమె భర్త కూడా మా ఇంటి ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించి తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం నాయకులు కౌన్సిలర్ భర్త మస్తాన్ పై దాడి చేయటమే కాకుండా అడ్డుకోబోయిన వైసీపీ కార్యకర్తల పై జూలకంటి అనుచరులు రాళ్ళు రువ్వూరు. ఈ దాడిలో ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించారు సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించారు