పల్నాట పెట్రేగుతున్న జూలకంటి దౌర్జన్యాలకు జనం బలి .
అందరూ ఊహించిందే జరుగుతుంది, బాబు కోరుకొన్నట్టే పల్నాడు రగులుతుంది. తనకి దక్కనిది మరెవరికి దక్కకూడదు అది నాశనం అవ్వాలని కోరుకొనే తత్త్వం ఉన్న వారు కోరుకొన్న వ్యక్తి కానీ ప్రాంతం కానీ ఎప్పటికి తమ అధీనంలోకి రాదని తెలిసిన నాడు ఆ వ్యక్తిని లేదా ప్రాంతాన్ని ఒక పధకం ప్రకారం క్రమ పద్దతిలో నాశనం చేయటానికి పూనుకొంటారు. అలాంటి నీచ మనస్తత్వం ఉన్న వ్యక్తుల్లో ప్రధముడు చంద్రబాబు అని చెప్పొచ్చు .
నాలుగు సార్లుగా వరస ఓటమిని రుచి చూపిస్తున్న మాచర్లని గెలవలేకపోయినా, నాశనం చేసి రాష్ట్రం దృష్టిలో నేర ప్రాంతంగా, ఆ ప్రాంత నాయకులు నేరస్తులుగా ముద్ర వేసే నీచ ఎత్తుగడలో భాగంగాఘోరమైన నేర చరిత్ర, విపరీతమైన నేర ప్రవృత్తి ఉన్న జూలకంటి బ్రహ్మా రెడ్డిని 2022 డిసెంబర్ లో మాచర్ల అసెంబ్లీ ఇంచార్జ్ గా నియమించాడు బాబు. నాటి నుండి ప్రశాంతంగా ఉన్న పల్నాడు గ్రామాల్లో అలజడి రేగింది, అణగారిన కక్షలు పెట్రేగడం ప్రారంభించాయి .
అందులో భాగమే నిన్న మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త పై జరిగిన హత్యాయత్నం . టీడీపీ చేపట్టిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే పోస్టర్లు అంటించే కార్యక్రమంలో భాగంగా రెంటచింతల మండలం వైసీపీ కార్యకర్త మేకపోతుల ఈశ్వర్ రెడ్డి ఇంటి గోడ పై కూడా బాబు గ్యారంటీ స్టిక్కర్ అంటించబోగా వారించిన ఈశ్వర్ రెడ్డి 2014 లో ఇంటికో జాబు అనే పోస్టర్ నా ఇంటికి అంటించారు కానీ మా ఇంట్లో ఎవరికి జాబు ఇవ్వలేదని ఇప్పుడు ఆ గ్యారంటీ పై తనకు నమ్మకం లేదని, తన ఇంటికి స్టిక్కర్ అంటించవద్దని ఖరాఖండిగా చెప్పేసాడు.
దీంతో అక్కడి నుండి వెళ్లిపోయిన బ్రహ్మారెడ్డి అనుచరులు దారి కాచి ఈశ్వర రెడ్డి ఊరి బయటకి రాగానే దాదాపు పదిహేను మంది గొడ్డళ్ళు, కత్తులు ఇతర మారణాయుధాలతో మూకుమ్మాడిగా చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్న మేకపోతుల ఈశ్వర్ రెడ్డిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆది నుండి వర్గ కక్షలకు అలవాలమైన కరువు సీమ పల్నాడు ప్రాంతంలో నాగార్జున సాగర్ నిర్మాణం తర్వాత కొంత కక్షలు కార్పణ్యాలు కొంత తగ్గుముఖం పట్టినా, 1983 లో రాజకీయ రంగ ప్రవేశం చేసి బాంబులనే తన ఇంటి పేరుగా ప్రచారం పొందిన పల్నాటి పులి బిరుదాంకితుడు అయిన ఒక నాయకుడి మూలంగా, 1999 నుండి మాచర్ల ఎమ్మెల్యే తనయుడిగా ఉన్న జూలకంటి బ్రహ్మా రెడ్డి మూలంగా 2004 వరకూ పల్నాడు ప్రాంతం కక్షలు, కార్పణ్యాలతో నాశనమయ్యిందనే చెప్పొచ్చు.
2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వర్గ కక్షలకు, ఫేక్షనిజానికి అండగా నిలవకపోవడం, మారిన కాలం, యువత ఉద్యోగ ఉపాధులకే తప్ప గొడవలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో కక్షలు తగ్గుముఖం పట్టాయి . 2001 లో మాచర్లలో జరిగిన ఏడు హత్యల ఘోరకలిలో ప్రధాన నిందితుడిగా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకొన్న నాటి టీడీపీ ఎమ్మెల్యే తనయుడు జూలకంటి బ్రహ్మా రెడ్డిని నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కంటితుడుపుగా టీడీపీ నుండి సస్పెండ్ చేశాడు కానీ కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి బ్రహ్మా రెడ్డికి శిక్ష పడకుండా కాపాడి 2004 ఎన్నికల్లో మాచర్ల టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాడు . కానీ అతను చేసిన ఏడు హత్యలతో భయకంపితులైన మాచర్ల ప్రజానీకం 2004 నుండి 2012 ఉప ఎన్నిక వరకూ వరసబెట్టి ఘోరంగా ఓడించడంతో మాచర్ల వదిలిపోయాడు బ్రహ్మరెడ్డి.
ఆ తరువాత 2014, 19 ఎన్నికల్లో కూడా మాచర్ల పిన్నెల్లి సోదరుల హవా ముందు టీడీపీ నిలవలేకపోవడంతో జనాల్ని భయకంపితులు చేసైనా మాచర్ల ప్రాంతాన్ని గుప్పిట్లోకి తెచ్చుకోవాలి, లేదా కుట్రలతో అలజడులు సృష్టించి మాచర్ల పై చెడు ముద్ర వేయాలి అనే లక్ష్యంతో ఫాక్షన్ వివాదాలకు మారుపేరైన జూలకంటిని మళ్ళీ మాచర్ల తీసుకొచ్చి సమసిపోయిన వర్గ కక్షలకు ఊపిరి ఊదే ప్రయత్నం చేశాడు బాబు. ఎన్ని చేసినా మాచర్లని గెలవటం బాబుకి సాధ్యం కాదు కానీ అల్లర్లు, అలజడుల చిచ్చు రేపి ఆ మంటల్లో చలి కాచుకోవాలన్న కోరిక అయితే కొంత తీరిందని చెప్పొచ్చు.
క్రూర మనస్తత్వలకు ధన బలం తోడైతే జరిగే ఆరాచకమే నేడు బాబు, జూలకంటిల ఆధ్వర్యంలో జరుగుతుంది. వంద మంది దోషులు తప్పించుకొన్నా ఒక్క నిర్ధోషికి కూడా శిక్ష పడకూడదనే భారత శిక్షాస్మృతిలోని వెసులుబాటులతో ఇలాంటి నేరస్థులు కొంతకాలం జులుం చెలాయించవచ్చు కానీ ఎల్లకాలం వీళ్ళ ఆరాచకాలు సాగుతాయి అనుకోవటం భ్రమ.