ఎన్నికలు సమీపిస్తున్న వేల అధికార వైసీపీ పార్టీలోకి చేరే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆళ్లగడ్డ బిజెపి ఇంచార్జ్ భూమా కిషోర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. భూమా కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి,గంధం భాస్కర్ రెడ్డి, అంబాటి మహేశ్వర్ రెడ్డి పలువురు స్థానిక బిజెపి నాయకులు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. బిజెపిలో కీలక నేతగా ఉన్న భూమా కిషోర్ రెడ్డి చేరికతో ఆంధ్ర ప్రదేశ్ లో బలపడాలి అనుకుంటున్న బిజెపికి పెద్ద దెబ్బ పడింది . మరో పక్క టిడిపి నుంచి పోటీ చేస్తున్న భూమా అఖిలప్రియకు తన సొంత ఇంటి నుంచే సహకారం కరువైంది.
వీరితోపాటుగా కాంగ్రెస్ కి చెందిన ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ గురునాథరావు, జంగారెడ్డిగూడెం మాజీ జడ్పిటిసి ముప్పిడి శ్రీనివాస్ సీఎం సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ , రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి (నాని) ,వైఎస్ఆర్సిపి రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు