డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో తాము దిట్ట అని టీడీపీ, జనసేన వర్గాలు మరోసారి నిరూపించుకున్నాయి. ఉమ్మడి సీట్ల ప్రకటన తర్వాత తమ పార్టీ కార్యకర్తలు నుంచి వ్యతిరేకత ఎదురుకుంటున్న నేపథ్యంలో దానిని ఎలా సైడ్ చేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చనుకుంటున్న తరుణంలో మొదట వైజాగ్ లో పర్యాటక రంగాన్ని ఆకర్షించే విధంగా ప్రభుత్వం నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జిని టార్గెట్ చేసాయి. ఫ్లోటింగ్ బ్రిడ్జిని నిర్వాహకులు టీ జంక్షన్ వద్ద వేరు చేసి మాక్ డ్రిల్ నిర్వహించగా, ఏర్పాటు చేసిన మొదటి రోజే విరిగిపోయిందంటూ ప్రచారం చేశారు. ఇదంతా అసత్య ప్రచారం అని ప్రజలకు తెలియడంతో తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ కావడం వారికే చెల్లింది.
తాజాగా క్రికెటర్ హనుమ విహారి విషయంలో దుష్ప్రచారాలకి తెరతీసారు. విహారికి ఏదో అన్యాయం జరిగినట్లు నిన్నటి నుంచి ఒకటే రభస చేస్తున్నారు. అసలు విషయం పరిశీలిస్తే 2023-2024 రంజీ సీజన్లో భాగంగా ఆంధ్ర టీం మొదటి మ్యాచ్ తర్వాత హనుమ విహారిని కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించి ఆంధ్ర జట్టు కీపర్ రికీ భుయ్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న హనుమ విహారికి కెప్టెన్సీ వల్ల ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని, జాతీయ జట్టులో చోటు దక్కితే ఆంధ్ర రంజీ టీంకు కష్టం అవుతుందని భావించి తప్పించారనే వార్తలు వచ్చాయి. ఆంధ్ర జట్టు మ్యాచులు అన్ని పూర్తి అయ్యేదాకా ఆగిన విహారి ఇప్పుడు అనూహ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తనను కావాలనే తప్పించిందని, నాకు అవమానం జరిగిన చోట ఉండలేనని ఇకపై ఆంధ్ర తరుపున క్రికెట్ ఆడనని విహారి వెల్లడించడం సంచలనంగా మారింది.
ఒక ప్లేయర్ ఫిర్యాదు మేరకు తనను తప్పించారని, ఆ ప్లేయర్ తండ్రీ వైసీపీలో కార్పొరేటర్ అంటూ విహారి చెప్పుకొచ్చాడు. అంటే వైసీపీలో ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి కంప్లైంట్ చేస్తే ఆంధ్ర క్రికెట్ కెప్టెన్ ను తప్పించే పరిస్థితిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉందా? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి జాతీయ జట్టుకు ఆడే ప్లేయర్ ను ఎవరు వదులుకోరు. కాగా అందులో కొసమెరుపు ఏంటంటే టీం సభ్యులంతా విహారినే కెప్టెన్ గా కొనసాగాలని సంతకాలు చేసిన ఒక లెటర్ ను విహారి జత చేశాడు. అందులో ఏం రాసి ఉందంటే విహారి తిట్టడం నిజమే కానీ ఇవి జట్టులో కామన్ అని రాసి ఉంది. మరి తిట్టడం జట్టులో కామన్ అయితే ఏసీ కు సదరు ప్లేయర్ ఎందుకు కంప్లైంట్ చేస్తాడు? అసలు తిట్టాల్సిన అధికారం విహారికి ఎవరిచ్చారు? జాతీయ జట్టులో ఆడుతున్నాం అని గర్వమా లేక సీనియర్ ప్లేయరని అహంకారమా?. కొత్తగా జట్టులోకి వచ్చే సభ్యులను ఒక సీనియర్ ఆటగాడు ఎంకరేజ్ చేసే విధానం ఇలా ఉంటే ఆ ఆటగాళ్లు ఇంకేం ఆడతారు.? ఒక కంప్లైంట్ ఇస్తే కెప్టెన్ ని తప్పించేస్తారా?
ఇదే విషయం పైన ఏసీఏ స్పందిస్తూ విహారి ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది. విహారి తనను తిట్టాడంటూ ఒక క్రికెటర్ ఏసీఏకు అధికారికంగా ఫిర్యాదు చేసిన మాట వాస్తవం. మా దృష్టిలో ఆటగాళ్లంతా సమానమే. అయితే కెప్టెన్సీ నుండి తప్పించడానికి ఇది కారణం కాదు. భారత టెస్టు జట్టులో స్థానం ఆశిస్తున్న విహారి పూర్తి సీజన్ కు అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో రికీ భుయ్ ను కెప్టెన్ గా నియమించాం. గతంలోనూ విహారి మాటతీరుపై ఫిర్యాదులు వచ్చాయి. ముస్తాక్ అలీ టోర్నీ సమయంలో జట్టులో విభేదాలు ఉన్నట్లు తెలిసింది. ఆంధ్రకు వచ్చినప్పటి నుంచి కూడా విహారి పదే పదే జట్టు మారేందుకు ప్రయత్నిస్తూ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కావాలని చాలా సార్లు అడిగాడు. తర్వాత అక్కడ అవకాశాలు దొరకకపోవడంతో ఆపై క్షమాపణలు కోరి ఇక్కడే ఆడుతానని అడగడటంతో జట్టు కోసం అతడిని కొనసాగించాం అని ఏసీఏ వెల్లడించింది. తాజా ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తదుపరి చర్యలు తీసుకుంటాం అని ఏసీఏ స్పష్టం చేసింది. రోజుకో అబద్దంతో ఎన్నికల్లో లబ్ది పోందాలని చూస్తున్న ప్రతిపక్షాలకు ఏసీఏ వివరణతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. అసత్యాల మీద చేసే రాజకీయలకు ఆయుష్హు తక్కువని ప్రతిపక్షాలు ఎప్పుడు గ్రహిస్తాయో వేచి చూడాలి.