జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు సభలు, సమావేశాల్లో మైక్ దొరికితే చాలు. తన గురించి తాను సినిమాస్టైల్లో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు. కానీ చేసే పనులు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. చంద్రబాబు నాయుడితో సావాసం ఎఫెక్ట్ ఉందేమో కానీ.. ప్రతి విషయంపై రెండు నాల్కల ధోరణ కలిగి ఉంటాడు. తమది పేద పార్టీ అని.. తాను సినిమాలు చేసి నడపాల్సిన పరిస్థితి ఉందని చెబుతుంటాడు. కానీ ఎలక్టోరల్ బాండ్లతో ఆయన వేషాలు బట్టబయలయ్యాయి.
బాండ్ల రూపంలో జనసేనకు రూ.21 కోట్లు వచ్చాయి. దీని వెనుక చంద్రబాబు పాత్ర ఉందని ప్రచారం ఉంది. వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ నుంచి రూ.10 కోట్లు, వల్లూరుపల్లి ప్రభు కిశోర్ నుంచి రూ.కోటి, శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెసిలిటీ మేనేజ్మెంజ్ నుంచి రూ.కోటి, నాట్కో ఫార్మా నుంచి రూ.5 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ లిమిటెడ్ నుంచి రూ.4 కోట్లు వచ్చాయి.
ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది శ్రీచైతన్య బాండ్ గురించి.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. దీనిని చంద్రబాబు, లోకేశ్, పవన్ తీవ్రంగా వ్యతిరేకించారు. కారణం.. ప్రముఖ కార్పొరేట్ స్కూళ్లలో చాలా వరకు తెలుగుదేశం వారివే కావడం. అందులో ముఖ్యమైనవి నారాయణ విద్యాసంస్థలు. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియా మొదలైతే కార్పొరేట్కు పిల్లలు వెళ్లరనే భయంతో ఆరోజుల్లో ఎల్లో గ్యాంగ్ గుక్కపెట్టి ఏడ్చింది. ప్రభుత్వం తెలుగును చంపేస్తోందని అందరూ మొసలి కన్నీరు కార్చారు.
మన పిల్లలకు ప్రపంచ స్థాయి అవకాశాలు దక్కాలంటే ఇంగ్లిష్పై పట్టు ఉండాలని జగన్ చెబితే వినలేదు. కానీ తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ పేద పిల్లలు మాత్రం ఆ సబ్జెక్టు చదువుకోకూడదని పచ్చ మనుషులు గగ్గోలు పెట్టారు. కార్పొరేట్ విద్యాసంస్థలు తమ తరఫున మాట్లాడేందుకు టీడీపీ, జనసేన, బీజేపీకి పెద్ద ఎత్తున డబ్బు సమకూర్చాయి. అందులో భాగంగానే పవన్ ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకించినందుకు రూ.కోటిని శ్రీచైతన్య నుంచి బాండ్గా పొందినట్లు తెలుస్తోంది. ఇక అనధికారికంగా నారాయణ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుని ఉంటాడో.. మిగిలిన వాటి నుంచి పార్టీ కోసం ఎంత పుచ్చుకుని ఉంటాడో.. డబ్బు కోసం యాడ్స్ చేయనని సేనాని కబుర్లు చెబుతుంటాడు. కానీ పెత్తందారుల సంస్థల తరఫున మాట్లాడి రూ.కోట్లు తీసుకుని దాచుకుంటున్నాడు. తన పిల్లల్ని ఇంగ్లిష్ మీడియం చదివిస్తున్నాడు.