రానున్న సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే 18 స్థానాలకు అభ్యర్థులును ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి వ్యతిరేఖ గాలులు వీస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేయదలచిన ఒక అయిదు, ఆరు నియోజక వర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజక వర్గాలలో జనసేన నాయకులు, జన సైనికులు నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు.ఒక నియో జక వర్గంలో ఒక నాయకుడిని నాలుగు సంవత్సరాలు పార్టీ కోసం పని చేయించుకొని చివరికి నీ దగ్గర డబ్బు లేదు అంటూ టికెట్ నిరాకరిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకొని , పార్టీ కోసం కష్టపడిన నాయకులకు కాకుండా వారికి టికెట్ కేటాయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయదల్చుకున్న పిఠాపురం నియోజక వర్గంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు అంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.
జనసేన తమ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు నుంచి వ్యతిరేకత ఎదురుకొంటున్న నియోజకవర్గాలు పిఠాపురం, తణుకు, పెడన, దర్శి,చీరాల, ఒంగోలు, గిద్దలూరు, తిరుపతి, విజయవాడ వెస్ట్, విశాఖ దక్షిణ, జగ్గంపేట , ధర్మవరం ఇలా అన్ని నియోజక వర్గాలలో రెండు వర్గాలుగా విడిపోయి గొడవలు పడుతున్నారు.
తిరుపతి నియోజక వర్గంలో ప్రస్తుత జనసేన ఇంఛార్జి జంగాలపల్లి శ్రీనివాసులు, కిరణ్ రాయల్ రెండు వర్గాలుగా విడిపోయి గొడవలు పడుతున్నారు. శ్రీనివాసులు నియోజక వర్గ ఇంఛార్జి గా ప్రకటించగానే లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ తిరుపతి మొత్తం బ్యానర్లు వేశారు. శ్రీనివాసులు తిరుపతిలో కొన్ని వార్డులలోని ఇతర పార్టీల నాయకులని పార్టీ మార్పుకి శ్రీకారం చుట్టారు, ఆ మార్పు మేము ఒప్పుకోము అంటూ కిరణ్ రాయల్ వర్గం ఎదురు తిరిగింది. ఏమైనా ఉంటే అధినాయకత్వంతో తెల్చుకుంటాం అని శ్రీనివాసులు పెత్తనం సాగనివ్వము అని కరాఖండిగా తేల్చి చెప్పారు.
ఒంగోలు జిల్లా లో కూడా అదే పరిస్థితే జనసేన నాయకులకి టిక్కెట్లు ఆశ చూపి , చివరికి ఆ ఉమ్మడి జిల్లాలో ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా అన్నీ టీడీపీ పరం చేశారు . దర్శి టికెట్ ఆశించిన ఎన్ఆర్ఐ వెంకట్ భంగపాటుకు గురైయ్యారు. వెంకట్ దగ్గర డబ్బు ఖర్చు పెట్టించి చివరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు అని వెంకట్ సన్నిహితులు దగ్గర వాపోతున్నారు.దర్శి లో కూటమి కి రెబెల్ కాండిడేట్ గా బరిలో ఉంటాను అని తన అనుచరులతో తెలిపారు. చీరాల సీట్ ఆశించిన ఆమంచి స్వాములు , టికెట్ రాదు అని తెలిసి జనసేన పార్టీ కి రాజీనామా చేశారు. గిద్దలూరు నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ఇప్పటికే ప్రకటించాడు.
విజయవాడ పశ్చిమలో పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేసిన పోతిన మహేష్ కు కాకుండా పొత్తులో భాగంగా బీజేపీకి సీట్ కేటాయించారు. పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని ఎన్నికల బరిలో ఉంటాను ఇప్పటికే ప్రకటించాడు. జగ్గంపేట నుంచి సూర్య చంద్ర కూడా పోటీలో ఉంటాను అని స్పష్టం చేసి ప్రచారం కూడా మొదలుపెట్టాడు.
విశాఖ దక్షిణంలో కూడా కార్పొరేటర్ సాధిక్, వంశీ కృష్ణ యాదవ్ లు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ కూడా లోకల్ , నాన్ లోకల్ అంశానికి తెరలేపారు. వంశీ నాన్ లోకల్ తమ మద్దతు ఉండదు అని కార్పొరేటర్ సాధిక్ వర్గం ఇప్పటికే తెలిపింది. ఇలా పక్క పార్టీల నుంచి నేతలు ను పార్టీలో చేర్చుకొని పార్టీ కోసం కష్టపడిన వారికి టిక్కెట్లు కేటాయించకపోవడంతో జనసేన నాయకులు, జనసైనికులు అధినేత చేస్తున్న పనులు నచ్చక పవన్ కళ్యాణ్ ను బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.పార్టీ పెట్టిన మొదట్లో జంపింగ్ లకు తమ పార్టీలో స్థానం లేదని చెప్పి , ఇప్పుడు ఇతర పార్టీల వాళ్ళని ఎన్నికల ముందు చేర్చుకొని వారికి టిక్కెట్లు ఇవ్వడంతో జన సైనికులు మండిపడుతున్నారు.