ఇప్పుడు ముద్రగడకు సీఎం సీటు ఇస్తాడా జగన్ అంటూ జనసైనికులు ఎకసెక్కాలు మొదలుపెట్టారు. ప్రశ్న సరైనదే. కానీ అడిగిన వారే తప్పు వర్గానికి చెందిన వారు. గుండెల మీద చేయి వేసుకొని నిజం చెప్పండి. మిమ్మల్ని ఎప్పుడైనా… ఒక్కసారి చంద్రబాబు కలిసారా? జనసేన నుంచి నాదెండ్లను తప్ప మరో ఏ నాయకుడి తో అయినా టీడీపీ వారు ఎవరైనా గౌరవప్రదంగా కలిసారా ? ఇప్పుడు కొత్తగా కొన్ని నియోజక వర్గాల్లో జనసేన కార్యాలయాలు తెరుస్తున్నారు. వాటిలో వేటికైనా స్థానిక తెలుగుదేశం నాయకులు ఎవరైనా వస్తున్నారా?? పోనీ జనసేన వారైనా పొత్తు ధర్మం ప్రకారం పిలుస్తున్నారా??? మరి ఇక్కడ లోపించింది ఏంటి ? “మర్యాద”.
ఆ మర్యాద అన్నది జగన్ దగ్గర దొరికింది కాబట్టే ముద్రగడ వెళ్ళి చేరారు. ఆయనకి తన అనుచరులపై కూడా మర్యాద ఉంది కాబట్టే.. “మీరందరూ వచ్చి ఇబ్బంది పడొద్దు, నేనొక్కడినే వెళ్ళి చేతులు కలుపుతా” అన్నారు. పవన్ కళ్యాణ్ లా వారు ఒక మాట అన్నా సంయమనం కోల్పోవద్దు. అని సిగ్గు లేకుండా చెప్పలేదు. ఆ మర్యాద దక్కినందుకే కాపులు ముద్రగడ వెంటా, ముద్రగడ జగన్ వెంట అడుగులు వేస్తున్నారు.
సరే పోనీ… గతం చూస్తే… కాపుల కోసం నిజంగా పోరాడింది ముద్రగడ కాదా? అయన కొడుకును బాబు చెప్పాడని పోలీసులు కొట్టుకొంటూ తీసుకెళ్లారు. అయన భార్య కోడల్ని నీచమైన భాషలో తెదెపా వారు తిట్టారు. ఆయన పూర్తిగా సక్సెస్ కాకపోయి ఉండొచ్చు, కానీ ఇన్నేళ్ళ పోరాటాన్ని తక్కువగా అంచనా వేయలేం కదా! కాపు ఉద్యమం వలన అయన నష్టపోయాడే కానీ లాభపడింది లేదు.
మరి ఈ గట్టున ఉన్న పవన్… ఆరోజున “కాపులకు రిజర్వేషన్ అవసరమా” అంటూ బాబును వెనకేసుకొచ్చాడు. సీఎం సీఎం అని జనసైనికులతో అరిపించుకుని, ఇప్పుడు ఆ అరుపులను గావుకేకలుగా మార్చవా ప్రవర్తించిందిపవన్ కాదా? సొంత పార్టీ పెట్టి నేను తోపు తుడుం ఖాన్ అని చెప్పుకొంటూ…జీ హుజూర్ అంటూ బాబుకు ఊడిగం చేస్తున్నా, కాపులను గంప గుత్తగా బాబుకు తాకట్టు పెడుతున్నా కూడా డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వం అని లోకేష్ చెప్పాక కూడా అహోం అహోం అంటూ బాబు పల్లకి మోస్తున్న పవన్ కంటే ముద్రగడ చాల నయం కదా.
చంద్రబాబు పల్లకీని భుజానికెత్తుకుని, కాపుల సెంటిమెంటుని కాళ్ళ కింద పెట్టి తొక్కిన పవన్ కన్నా… ఇస్తే ఇవ్వగలననీ, లేకుంటే లేదనీ నిక్కచ్చిగా చెప్పే జగన్ వెంట ఉంటే బెటరు కాబట్టే ముద్రగడ వైసీపీలో చేరారని పాపం కొత్తగా ఓటొచ్చిన జనసైనికులు ఎప్పటికి తెలుసుకునెనో ఏమో…