2024 సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాలకు గాను 18 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. మూడు జాబితాలు కలిపి 18 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 3 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. జనసేన పోటీ చేయబోయే 2 ఎంపీ స్థానాలుకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించిన అభ్యర్థులే ఎంతవరకు పోటీలో ఉంటారు అనేది రానున్న రోజుల్లో చూడాలి
జనసేన అభ్యర్థుల జాబితా ఈ విధంగా ఉంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, నెల్లిమర్ల – లోకం మాధవి, అనకాపల్లి – కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ – పంతం నానాజీ, రాజా నగరం – బత్తుల బల రామకృష్ణ, తెనాలి – నాదెండ్ల మనోహర్, నిడదవోలు – కందుల దుర్గేష్, పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్, పి.గన్నవరం – గిడ్డి సత్యనారాయణ, రాజోలు – దేవ వరప్రసాద్, తాడేపల్లి గూడెం – బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం – పులివర్తి ఆంజనేయులు, నరసాపురం – బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు, పోలవరం – చిర్రి బాల రాజు, తిరుపతి – ఆరణీ శ్రీనివాసులు, రైల్వే కోడూరు – డాక్టర్ యనమల భాస్కర్ రావు ఇప్పటి వరకు ప్రకటించిన సీట్లు, ఇంకా ప్రకటించాల్సిన సీట్లలో అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. జనసేన పోటీ చేయబోయే రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఇప్పటికే కాకినాడ నుంచి టీ టైం ఉదయ్, మచిలీపట్నం నుంచి బాలశౌరిని ప్రకటించారు.