తాడేపల్లిగూడెంలో అట్టహాసంగా నిర్వహిద్దాం అని ఎంతో ప్లాన్ చేసి ఏర్పాటు చేసుకున్న తెలుగు జన విజయకేతనం సభకు జనం కరువయ్యే సరికి డీలా పడిపోయిన తెలుగుదేశం జనసేన నాయకత్వం తేరుక్కోకముందే ఏలూరు జనసైనికులు పవన్ కళ్యాన్ కి మరో షాక్ ఇచ్చారు..
ఒక పక్క తాడేపల్లిగూడెంలో తెలుగు జన విజయకేతనం సభ జరుగుతున్న సమయంలోనే ఏలూరు జనసేన నాయకులు ఆ సభని బాయ్ కాట్ చేస్తున్నాం అని ప్రకటించి ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో జన సైనికులు నిరసనకు దిగారు. నగిరెడ్డి కాశీ నరేష్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు పెట్టకుని పొత్తులో తమకి జనసేనకే సీటు కేటాయించాలని పట్టు బడుతూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం ఏలూరు నగరంలో హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజక వర్గాల్లో ఇదే రీతిన మాకు సీటు అంటే మాకు సీటని తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు నిరసనలకు దిగడంతో పొత్తు చిత్తవుతుందన్న ఆందోళన ఇరు పార్టీల నాయకత్వాళ్ళో నెలకొంది.