జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎన్నికల ప్రచారంను ఈరోజు నుండి మొదలు పెడుతున్నారు. తొలివిడతలో భాగముగా మొత్తం 14 రోజుల పాటు జన సేన పార్టీ పోటి చేసే పది నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగించనున్నారు . అలాగే తన ప్రచార వాహనం వారాహిని కూడా బయటకు తేనున్నారు. 2022 డిసెంబర్ లో వివాదాస్పద వారాహి రిజిస్ట్రేషన్ తర్వాత వాహనానికి కొండగట్టులో వారాహికి పూజలు చేసి ఇహ పై రోజూ వారాహిలో తిరిగి ప్రశ్నిస్తా అన్న పవన్ ఈ ఏడాదిన్నర కాలంలో కేవలం నాలుగు సార్లు మాత్రమే వారాహి పై ప్రచారానికి వచ్చారు. వారాహి మైలేజ్ అస్సలు రావట్లేదో మరే కారణమో కానీ ఇన్నాళ్ళూ పక్కన పెట్టి దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికల వేల వారాహిని బయటకి తీయనున్నారు.
మొదట ఈరోజు పిఠాపురం కు చేరుకొని తన ప్రచార రథం వారాహి మీద ప్రచారం చెయ్యనున్నారు. పిఠాపురంలో ఈరోజు నుండి ఏప్రిల్ రెండు వరకు మొదటి విడత ప్రచారం చేస్తారు, ఏప్రిల్ 3వ తేదీన జన సేన పార్టీ ముఖ్యనేత జన సేన పార్టీ సర్వస్వం అయిన నాదెండ్ల మనోహర్ కు సపోర్ట్ గా తెనాలి లో ప్రచారం చేయనున్నారు, 4వ తేదీన నెల్లిమర్ల లో లోకం మాధవి తరుపున, 5వ తేదీన అనకాపల్లిలో కొణతాలరామకృష్ణ తరుపున, 6వ తేదీన యలమంచిలి లో విజయ్ కుమార్ తరుపున , 7వ తేదీన పెందుర్తి లో పంచకార్ల రమేశ్ తరుపున , 8వ తేదీన కాకినాడ రురల్ లో పంతం నానాజీ తరుపున ప్రచారం చేయనున్నారు పవన్ కళ్యాణ్.
మళ్ళీ తిరిగి 9వ తేదీన తను పోటి చేస్తున్న పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గోంటారు, 10వ తేదీన రాజోలు లో వర ప్రసాద్ తరుపున , 11వ తేదీన పి గన్నవరం లో సత్యనారాయణ తరుపున, 12వ తేదీన రాజానగరం లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు జన సేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తొలివిడత 14 రోజుల్లో అత్యధికంగా తను పోటి చేసే పిఠాపురంలోనే ఐదు రోజులు ప్రచారం చెయ్యనున్నడం గమనార్హం.