ఏపీ ఎన్నికల పోటీలో భాగంగా కూటమిగా జత కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న తరుణంలో జనసేన పార్టీ కి 21 సీట్లు దక్కాయి. దానిలో 9 మంది నేతలు బయట పార్టీ నుండి వచ్చిన వారే. ఇంకో నలుగురు నేతలు ఎలక్షన్ ముందు వచ్చిన వారే. జనసేన పార్టీ ఆవిర్భావరోజు నుండి పవన్ కళ్యాణ్ వెంట నడిచిన నాయకులకు కనీసం సగం టికెట్ లు కూడా కేటాయించలేని పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వున్నారు.
కొణతాల రామకృష్ణ టీడీపీకీ రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు సూచనతో జనసేన లో జాయిన్ అయ్యి అనకాపల్లి ఎమ్మేల్యే అభ్యర్ధి గా టికెట్ పొందారు. పంచకర్ల రమేష్ బాబు వైసీపీ కి రాజీనామా చేసి జనసేన లో జాయిన్ అయ్యి పెందుర్తి టికెట్ సంపాదించారు. ఇక జనసేన పార్టీ కి అత్యంత కీలక అసెంబ్లీ నియోజకవర్గమైన భీమవరంలో అంత్యంత దారుణంగా టీడీపీ నాయకుడు అయిన పులపర్తి ఆంజనేయులను పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి జనసేన లోకి తీసుకొని టికెట్ ఇచ్చారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అయిన ఆరణి శ్రీనివాసులను వైసీపీ లో టికెట్ రాకపోతే పిలిచి మరీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్సీ అయిన వంశీ యాదవ్ కి వైసీపీ లో టికెట్ ఇవ్వడం లేదు అని తెలుసుకొని టికెట్ ఇస్తాం అనే హామీ తో వైజాగ్ సౌత్ టికెట్ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని అయిన యనమల భాస్కర్ రావును జనసేన లో జాయిన్ చేసుకొని రైల్వే కోడూరు టికెట్ కేటాయించారు.
తాజాగా జనసేనకు అవనిగడ్డలాంటి బలమైన నాయకులు కలిగిన నియోజకవర్గంలో కూడా టీడీపీ ఇంచార్జీ అయిన మండలి బుద్ధప్రసాద్ ను జనసేన లో కి తీసుకొని టికెట్ కేటాయించారు. మరొక నియోజకవర్గం పాలకొండలో టీడీపీ ఇంచార్జీ నిమ్మక జయకృష్ణ జనసేన లో జాయిన్ అయ్యి టికెట్ సంపాదించారు. ఇంకా రాజోలు నుండి ఈ మధ్యనే జాయిన్ అయిన వరప్రసాద్ కు , ఉంగుటూరు లో పత్సమట్ల ధర్మరాజు కు, పి. గన్నవరం లో గిడ్డి సత్యనారాయణ వీళ్లంతా ఈ మధ్యనే జనసేన లో జాయిన్ అయిన నా కూడా వీరికి టికెట్ లు కేటాయించారు పవన్ కళ్యాణ్.
అంతే కాకుండా కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, సుందరపు విజయ్ కుమార్, బోలిశేట్టి శ్రీనివాస్ వీళ్లంతా 2019 ముందు జనసేన లోకి వచ్చిన నాయకులు. ఇంకా ఎంపీ అభ్యర్ధులు అయిన మచిలీపట్నం అభ్యర్థి బాలశౌరి వైసీపీ నుంచి వచ్చిన నాయకుడు, కాకినాడ లో పోటి చేసే అభ్యర్థి టీ టైమ్ అధినేత ఉదయ్ ప్రజలతో అంతగా సంబంధం లేని వారు కావడం గమనార్హం. ఇలాంటి వారికి టిక్కెట్లు కేటాయించేసరికి గత పది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ కోసం ఆస్తులమ్ముకొని తిరిగిన నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడటం ప్రారంభించారు. ఇప్పటికే సగం నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి జెండా మోసే కార్యకర్తలు లేని పరిస్థితికి వచ్చింది. ఈ ప్యారాచూట్ నేతలతో జనసేన పార్టీ కనీసం ఒక్క సీటు అయినా గెలుస్తుందో లేక మరోసారి ఘోర ఓటమి పాలవుతుందో వేచి చూడాలి.