ఏపీలో సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల తరువాత ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. పల్నాడు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తమ నామినేషన్ ర్యాలీలతో దూకుడును పెంచారు. నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , చిలకలూరిపట అభ్యర్ధి కావటి మనోహర్ నాయుడు, పెదకూరపాడు అభ్యర్థి నంబూరు శంకర్, వినుకొండ అభ్యర్థిగా బొల్ల బ్రహ్మనాయుడు భారీ ర్యాలీ గా వెళ్ళి నామినేషన్ వేశారు. ప్రతి ఒక్క అభ్యర్థి తమ ఇష్ట దైవానికి పూజలు చేసి తోడుగా నియోజకవర్గ కార్యకర్తలు భారీగా వేల సంఖ్యలో తరలిరావడంతో అట్టహాసంగా తమ నామినేషన్ లు దాఖలు చేశారు. ఈ ర్యాలీకి వచ్చిన జనాలను చూసి ప్రత్యర్ధి పార్టీలలో అప్పుడే తమ గెలుపుపై వణుకు మొదలైంది. అదే సమయంలో మండుటెండలో కూడా ర్యాలీలకు వచ్చిన వేల మంది జనాల్ని చూసి వైసీపీలో ఉత్యాహం రెట్టించింది.
కాగా నామినేషన్ దాఖలు చేయాల్సిన అభ్యర్థుల్లో ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ఈనెల 24న , నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి భారీ ర్యాలీ గా వెళ్ళి నామినేషన్ దాఖలు చేసేందుకు నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గురజాల అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి 24నే భారీ జనసందోహం మధ్య నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చకచకా చేసుకుంటున్నారు. మరో కీలక నాయకుడు మంత్రి అయిన అంబటి రాంబాబు తన సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా 24నే నామినేషన్ వేసేందుకు గట్టిగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో నభూతో నభవిష్యత్ లా దిగ్విజయంగా సాగి పిడుగురాళ్ల లో జరిగిన పల్నాడు సిధ్ధం సభతో పార్టీలో కదనోత్యహం నింపారు . ఈ యాత్రతో జగన్ ఇచ్చిన స్ఫూర్తితో వైసీపీ శ్రేణులు నూతనోత్సాహంతో ఎన్నికల కదనరంగంలోకి దిగాయి. ఇప్పటికే వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్ని నియోజకవర్గాలు సుడిగాలిలా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. నియోజకవర్గ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గలో ప్రతీ గడప గడపకు వెళ్ళి చేసిన సంక్షేమం అభివృద్ధి వివరిస్తూ ప్రచారం లో దూసుకుపొతూ ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తున్నారు.