రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. తద్వారా ఏపీలో ఎంఎస్ఎంఈల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు ఉద్యోగాల కల్పన ఏటేటా భారీగా పెరుగుతోంది. భారీ పరిశ్రమలలో మెషీన్ ల ద్వారా ఎక్కువ ఉత్పత్తి జరుగుద్ది కాబట్టి ఉద్యోగుల అవసరం తక్కువ ఉంటుంది. కానీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉద్యోగుల అవసరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చిన్న పరిశ్రమల ద్వారానే ఉద్యోగాలు, ఉపాధి ఎక్కువగా లభిస్తాయి.
వైఎస్ జగన్ పాలనలో రికార్డు స్థాయిలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భానుప్రతాప్సింగ్ వెల్లడించారు. 2021–22వ ఆర్థిక సంవత్సరంలో ఏపీలో ఎంఎస్ఎంఈల ద్వారా 12,29,335 మందికి ఉద్యోగాలను కల్పించగా 2022–23లో ఏకంగా 27,27,273 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు రాజ్య సభలో కేంద్ర మంత్రి తెలిపారు. తద్వారా 2022-23 లో రాష్ట్రంలో 27. 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి దేశంలోనే 7 వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
ఏపీలో చంద్రబాబు దిగిపోయేనాటికి 1.93 లక్షలు(1,93, 530)ఎంఎస్ఎంఈలు ఉండగా 2023 డిసెంబర్ నాటికి వాటి సంఖ్య 7 లక్షల (6, 99, 881)కు చేరడం గమనార్హం. అంటే కేవలం జగన్ హయాములో వచ్చిన ఎంఎస్ఎంఈలు అక్షరాలా 5.07 లక్షలు కావడం విశేషం. బాబు హయాంలో ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్లులకు బకాయి పెట్టిన రూ.1,588 కోట్ల ప్రోత్సాహకాలను కూడా జగన్ ప్రభుత్వమే చెల్లించడంతో పాటు జగన్ ప్రభుత్వం మరో రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేసింది
2022-23లో ఎంఎస్ఎంఈల ద్వారా అత్యధిక ఉద్యోగాలు కల్పించిన టాప్-10 రాష్ట్రాలు
రాష్ట్రం-ఉద్యోగుల సంఖ్య
1)మహారాష్ట్ర-48,78,918
2)తమిళనాడు-46,45,718
3)ఉత్తరప్రదేశ్-41,76,199
4)కర్ణాటక-35,39,106
5)పశ్చిమబెంగాల్-29,27,276
6)రాజస్థాన్-28,12,280
7)ఆంధ్రప్రదేశ్-27,27,273
8)తెలంగాణ-26,73,150
9)గుజరాత్-24,27,935
10)బీహార్-21,66,299