గణతంత్ర దినోత్సవంగా సందర్భంగా జరిగిన పెరేడ్లో ప్రభుత్వ పాఠశాలలు మరియు విద్యార్థులలో జగన్ పరిపాలనలో వచ్చిన మార్పులను ఉద్దేశిస్తూ తయారు చేసిన శకటం చూసిన ఉత్తరాది జనం ఇంకా ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే మరొక అధ్భుతమైన అంశంలో ఆంధ్రా తన సత్తాని చాటింది.
ఒక జిల్లా ఒక ఉత్పత్తి (వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ – ఓడీఓపీ) పోటీలలో లో ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్కు చెందిన అభ్యర్థులు మరియు అధికారులు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓడీఓపీలో ఒక్క ఏపీకే 6 అవార్డులు వచ్చాయి.
ఆంధ్రా నుంచి ప్రతిష్టాత్మకంగా భావించే ఉత్పత్తులు కాకినాడ జిల్లా ఉప్పాడ జామ్దాని చీరలు, అల్లూరి జిల్లా అరకు కాఫీకి బంగారు పతకాలు, పొందూరు కాటన్, కోడుమూరు గద్వాల్ చీరలకు కాంస్య పతకాలు, మదనపల్లె పట్టు, మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు లభించాయి.
సామాజిక, ఆర్ధిక అభివృద్దిని ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని ఎంపిక చేసి, బ్రాండింగ్, విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్.
అయితే, ఈ ఉత్నత్తుల నాణ్యత మన్నికగా ఉండేలా ఎప్పటికప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు, ఇచ్చిన ప్రోత్సాహంతో ఆయా ఉత్పత్తుల తయారీదారులు కేంద్రం వరకూ వెళ్ళి తమ సత్తా చాటారు వీరందరినీ సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసారు. జగన్ వారిని, అధికారులను అభినందించారు.