ఏపీ పద్మశాలి కార్పొరేషన్ చైర్ పర్సన్ జింకా విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పద్మశాలీలకు జగనన్న ప్రభుత్వంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చినట్లు తెలిపారు. చేనేత వృత్తిలో ఉన్న పద్మశాలీయులకు అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా విజయం తర్వాతనే పద్మశాలీయులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. 2020 అక్టోబర్ 18న ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత చైర్ పర్సన్ గా నన్ను నియమించగా, నాతో పాటు 12 జిల్లాలకు చెందిన పద్మశాలిలని డైరెక్టర్లుగా నియమించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని వెల్లడించారు.
2014లో టిడిపి ప్రభుత్వంలో పద్మశాలీలకు చట్టసభల్లో ఎటువంటి ప్రాతినిధ్యం లేదు, 2019 వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చట్టసభల్లో కర్నూలు నుంచి ఎంపీగా డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్సీగా మురుగడ హనుమంతరావు ఉన్నారు అని అలాగే ఆప్కో చైర్మన్ గా చల్లపల్లి మోహన్ రావు, ప్రస్తుతం గంజి చిరంజీవి ఉన్నారు అని తెలిపారు. అంతే కాకుండా రాష్ట్రంలో పద్మశాలిలు ఎక్కువగా ఉండే ప్రొద్దుటూరు, రాయదుర్గం ,వెంకటగిరి ,చీరాల మున్సిపల్ చైర్ పర్సన్ గా పద్మశాలీలకే జగన్ మోహన్ రెడ్డి అవకాశం కల్పించారని తెలిపారు. 2024 ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఏ పద్మశాలిలకు అవకాశం ఇవ్వలేదు, కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ఇప్పటికే ఎమ్మిగనూరు నియోజక వర్గానికి బుట్టా రేణుక, మంగళగిరికి మురుగుడు లావణ్యను ఎంపిక చేసిందని తెలిపారు. ఇదే సమావేశంలో మాట్లాడుతూ నేను చైర్ పర్సన్ గా ఎన్నికైన తర్వాత అనేకమంది పద్మశాలీల పిల్లలని విదేశీ విద్యాపథకంపై అవగాహన కల్పించి ఉన్నత చదువులు చదువుకోవడానికి పిల్లలకి అవగాహన కల్పించినట్లు చెప్పుకొచ్చారు. ఇన్ని అవకాశాలు కల్పించిన జగన్ మోహన్ రెడ్డి వెంటే మనం అందరూ నడవాలి అని తెలిపారు.
ఇదే సందర్భంలో విజయలక్ష్మి మాట్లాడుతూ 2014లో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలు ముందు అనేకమైన హామీలు నోటికి వచ్చినట్లు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదని చెప్పారు. గతంలో టిడిపి నమ్మి ఓటేసిన పద్మశాలీలకి సరైన బుద్ధి చెప్పాడు చంద్రబాబు, గతంలో పద్మశాలిలకి చెప్పిన కొన్ని హామీలు చూద్దామంటూ.. చేనేత వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా, చేనేత కార్మికుల బ్యాంకు రుణాలు మాఫీ, పవర్ లూమ్ లపై ఉన్న రుణాలు రద్దు చేస్తాం, చేనేత కార్మికులకు వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్లో ప్రతి ఏడాది 1000 కోట్లు కేటాయిస్తాం, రాష్ట్రవ్యాప్తంగా నేత బజార్లు ఏర్పాటు చేస్తాం, జిల్లాకు ఒక చేనేత పార్క్ ఏర్పాటు చేసి కార్మికులకు శిక్షణ ఉపాధి కల్పించడం, వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల , మంగళగిరి , పెడన , ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆసుపత్రులు , వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తాం, 1,50,000తో ఉచితంగా ఇల్లు మగ్గం షెడ్డు ఏర్పాటు, చేనేత కార్మికుల పిల్లల్ని చదివించేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఉచిత వైద్యం ఇలా ఒకటా రెండా నోటికి ఎన్ని వస్తే అన్ని హామీలు చెప్పేసి ఏ ఒక్క హామీ చంద్రబాబు నాయుడు పూర్తి చేసిన పాపాలు పోలేదని గతంలో చేసిన పొరపాటును మళ్లీ మనం చేయకూడదని, పద్మశాలీలందరూ జగన్మోహన్ రెడ్డి వైపే ఉండాలని జింక విజయలక్ష్మి కోరారు.