సహాయం కోసం వచ్చే ఆపన్నులను ఆదుకోవడంలో జగనన్న శైలి ప్రత్యేకమని చెప్పొచ్చు. తాజాగా భీమవరం పర్యటనలోనూ తన మంచి మనసును సీఎం జగన్ మరోసారి చాటుకున్నారు. అనేక ఇబ్బందులతో బాధపడుతున్న వారి సమస్యలను విని అప్పటికప్పుడే సాయం చేయాలని ఆదేశించడంతో దాదాపు గంటలోనే తొమ్మిది మంది బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున తొమ్మిది లక్షల రూపాయల చెక్కులను అధికారులు పంపిణీ చేసారు.
అనారోగ్యంతో పాటు ఇతర ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న తొమ్మిదిమంది జగనన్న విద్య దీవెన పథకం నిధులను విడుదల చేసేందుకు భీమవరం పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ ని కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. దాంతో మానవత్వంతో స్పందించిన ముఖ్యమంత్రి జగన్ సదరు బాధితులను తక్షణమే ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సమస్యలు విన్నంవించుకున్న 9 మంది అర్జి దారులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి తో కలిసి అందజేశారు.
చెక్కులు అందుకున్న వారి వివరాలు..