ఏపీలో 2024 లో జరగబోయే ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని వివిధ సర్వేలన్నీ వెల్లడిస్తున్నాయి. తాజాగా జన్ మత్ సర్వే కూడా ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారని తెలిపింది.
వివరాల్లోకి వెళితే జన్ మత్ నిర్వహించిన తాజా సర్వేలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 113 – 115 అసెంబ్లీ సీట్లు గెలిచే అవకాశం ఉందని, 17 – 19 ఎంపీ సీట్లను అధికార వైకాపాకు ప్రజలు కట్టబెట్టబోతున్నారని జన్ మత్ సర్వే వెల్లడించింది. టీడీపీ జనసేన కూటమికి 50 – 52 అసెంబ్లీ సీట్లు, 4-5 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని జన్ మత్ సర్వేలో తేటతెల్లమైంది. కాగా గత సంవత్సరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 60 -62 స్థానాలు వస్తాయని జన్ మత్ సంస్థ ఖచ్చితంగా అంచనా వేసింది.
సర్వే ఏదైనా ఏపీ ప్రజలు జగన్ కే పట్టం కట్టబోతున్నారని టీడీపీ శ్రేణుల్లో భయాందోళన మొదలైంది. ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేలతో పాటు తాము స్వయంగా నిర్వహిస్తున్న రహస్య సర్వేల్లో కూడా టీడీపీ గెలిచే అవకాశం లేదని తేలడంతో ఆ పార్టీ వర్గాలు నిరాశలో కూరుకుపోతున్నాయి. గత నెలలో టైమ్స్ నౌ విడుదల చేసిన సర్వేలో ఏపీలో జరగబోయే 2024 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం కొనసాగబోతుందని 24-25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మ్రోగించబోతుందని వెల్లడించిన విషయం తెలిసిందే. సర్వేలన్నీ జగన్ కే అనుకూలంగా వస్తుండడంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వైకాపా శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నాయి.