ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పేరు వినపించగనే అందరికీ మొదట గుర్తు వచ్చేది వలసలు, వలస అంటే శ్రీకాకుళం అంతలా ప్రసిద్ధి చెందింది.దీనిని అరికట్టేలా సిక్కోలు ప్రజలు ఊహకు అందని విధంగా తమ జీవితంలో చూస్తామా అనే ఆలోచనలను నేను చేసి చూపిస్తా అని జగన్ మోహన్ రెడ్డి సిక్కోలు ప్రజల కలలను సాకారం చేసి చూపాడు.
అభివృద్ది వైపు శ్రీకాకుళం అడుగులు వేగంగా పడుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల కోరిక చాలా ఏళ్లు గా మరుగున పడిన మూలపేట పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన పనులు శంకుస్థాపనకు నోచుకోని పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
మనం తరచూ చూస్తాం ఉంటాం వేటకి వెళ్ళి తీరం దాటి పాకిస్థాన్ కి పట్టుబడ్డారు, బంగ్లాదేశ్ కి పట్టుబడ్డారు అని అలాంటి మత్స్యకార సోదరులు కోసం బుడగట్ల పాలెం లో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టారు. మత్స్య కారులు ఎక్కువ ఉన్న జిల్లా శ్రీకాకుళం , మత్స్యకారులు వేట జీవనం దృష్ట్యా వారికి అనుగుణంగా ఇచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో 365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్. వేట పడవలు నిలుపుపోవడనికి చక్కటి డెక్ వారి అభివృద్ది కోసం అన్ని విధాలుగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది
శ్రీకాకుళంలో అన్నిటి కంటే ముందు గుర్తు వచ్చేది ఉద్దాణం ప్రజల కిడ్నీ సమస్య, ఉద్దన ప్రాంతం లో ప్రతి ఒక ఇంట్లో కిడ్నీలకు సంబంధించిన ఏదో ఒక జబ్బుతో బాధ పడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు, అలాంటి దీర్ఘకాలిక సమస్య కు శాశ్వతంగా పరిష్కారం చూపించింది ప్రస్తుత జగన్ ప్రభుత్వం, 700 కోట్ల వ్యయంతో ఉద్దాన ప్రాంత ప్రజల కోసం సుజల స్రవంతి మంచి నీటి పథకం ద్వారా ఇంటి ఇంటికి ట్యాప్ ద్వారా మంచి నీరు ఇప్పటికే అందించింది ప్రభుత్వం,ఈ పథకం ద్వారా ఇచ్చాపురం పలాస ప్రాంతాలలో 807 గ్రామాలకు మంచి నీరు అందుతుంది. వ్యాధి గ్రస్తులు కోసం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు తద్వారా ఎక్కడికో వెళ్ళి డయాలిసిస్ చేపించుకునే పని లేకుండా చేశారు.
మూలపేట పోర్ట్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి, 4362 కోట్ల వ్యయంతో ఈ పోర్ట్ నిర్మాణంనీ ఏప్రిల్ 19 2023 న మొదలు పెట్టి 2025 చివరికి పూర్తి చేయాలి అని మొదలుపెట్టారు. మూలపేట పోర్ట్ 4 బెర్తులుగా నిర్మాణం తలపెట్టి 2024 చివరకి మొదటి బెర్త్ ఓపెన్ చేసి కార్యకలాపాలు చేపట్టే విధంగా సిద్దం చేస్తున్నారు, NH 16 కి అనుసంధానం చేసి విశాఖ కొలకత్తా ఇండస్ట్రియల్ కారిడార్ లో కీలకం చేసేలా అడుగులు వేస్తున్నారు. పోర్ట్ అనుకునే ఇప్పటికే 5000 ఎకరాలు భూసేకరణ చేపట్టి పోర్ట్ ఆధారిత ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కొరకు ఆ భూమి కేటాయించనున్నారు తద్వారా ముప్పై వేల మంది కి ఉపాధి అవకాశం కల్పించవచ్చు అని జగన్ ప్రభుత్వం తెలిపింది.దీనితో చాలావరకూ వలసలు తగ్గే అవకాశం ఉంది.ఇక్కడ కూడా స్థానికులుకి ఉద్యోగ కల్పనలో 70 శాతం స్థానికేతరులుకు 30 శాతం
గొట్ట బ్యారేజ్ నుంచి హిర మండలం రిజర్వియర్ కు 175.35 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టారు. వంశధార ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 1000 గ్రామాల ప్రజలకు మంచి నీటి అందించారు.
852 కోట్లతో మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ ను నిర్మాణం చేపట్టడానికి ఇప్పటికే శంకుస్థాపనకు నోచుకోని పనులు వేగవంతంగా అవుతున్నాయి.
దశాబ్దాలుగా తమ సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న సిక్కోలు ప్రజలకు ఊహించని వరాలు ఈ ప్రాజెక్టులు .