AP Cabinet: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ క్యాబినెట్ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
ఏపీ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు
నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన తీర్మానాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా ఇంధన రంగంలో 22000కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత 4వ విడత నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటుకు ఆమోదించిన కేబినెట్ యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.