‘అది అమలు చేయలేని మేనిఫెస్టో. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. వాళ్లు ప్రామిస్ చేసేదానికి బీజేపీ పాలసీస్కు క్లారిటీ లేదు. ఎక్కడో ఒక చోట ఉమ్మడి మేనిఫెస్టో పెట్టుకుని ముందుకు పోకపోతే ఆ తర్వాత ఇబ్బంది అవుతుందన్నాను. కానీ జరగలేదు. మేనిఫెస్టోకు మేం దూరంగా ఉన్నట్లుగానే బిహేవ్ చేశారు. మంచిది. అది టీడీపీ, జనసేనదిగానే వెళ్తోంది. మా మద్దతు ఉంటుందనేది జస్ట్ మాటంతే’ ఏపీ మాజీ సీఎస్, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు ఓ మీడియా ఛానల్కు చెప్పిన మాటలివి.
చంద్రబాబు అమలు సాధ్యం కాని హామీలిచ్చాడని రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చేసిన వ్యక్తే కుండబద్ధలు కొట్టారు. కానీ ఎల్లో మీడియా మాత్రం అది అద్భుతమంటూ కథనాలు రాస్తోంది. జగన్ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని మొన్నటి వరకు తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు గగ్గోలు పెట్టారు. తీరా బాబు, పవన్ మేనిఫెస్టో వదిలాక.. అందులోని పథకాలు చూసి వారే నోరెళ్లబెడుతున్నారు. టీడీపీపై నమ్మకం లేక బీజేజీ ముందే దూరం జరిగింది. ఈ విషయాలనే ఐవైఆర్ స్పష్టం చేశారు.
సీఎస్గా పనిచేసిన ఆయనకు రాష్ట్రంపై పూర్తి అవగాహన ఉంటుంది. బడ్జెట్ విషయాలు బాగా తెలుసు. అందువల్లే బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. సంపద సృష్టిస్తా.. హామీలన్నీ అమలు చేస్తానని నారా వారు చెబుతున్నారు. కానీ 2014 – 19 మధ్య ఆయన పాలన దారుణంగా చేశారో గణాంకాలు చెబుతున్నారు. అప్పట్లో 2018 వరకు ఎన్డీఏలో భాగస్వామిగానే ఉన్నారు. వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారని సాక్షాత్తు బాబే చెప్పారు. కానీ ప్రతి ఏడాది రెవెన్యూ లోటు చూపించారు. గతంలో సీఎంగా చేసినప్పుడు ఇదే పరిస్థితి. బాబు ఏనాడూ సంపద సృష్టించలేదు. అప్పులతో కాలం వెళ్లదీశారు. ఈ విషయాలపై స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టే ఐవైఆర్ టీడీపీ, జనసేన మేనిఫెస్టో బోగస్ అని తేల్చేశారు. అది ఉమ్మడిది కాదని, తాము దూరంగానే ఉన్నట్లు చెప్పేశారు. నిద్ర లేచింది మొదలు బాబు తనను తాను గొప్ప విజనరీగా చెప్పుకొంటుంటారు. కానీ అవి డబ్బా మాటలే. ఆయన్ను నమ్మితే నిండా ముంచేస్తాడని పొత్తులోని కమలం పార్టీ నేతలు ఆల్రెడీ గ్రహించేశారు. అందువల్ల ప్రజలారా జాగ్రత్త. బాబును నమ్మితే నట్టేట ముంచేస్తాడు.