సోషల్ మీడియా విప్లవం ప్రజలని ఎంతగా ప్రభావితం చేసిందో కొత్తగా చెప్పనవసరం లేదు. దేశంలో కోట్లాది మంది సోషల్ మీడియా సహాయంతోనే సమాజంలో జరుగుతున్న మంచి చెడులని చూస్తూ వారి సన్నిహితులతో అదే మాధ్యమాల ద్వారా వాటిని పంచుకుంటూ ఒక సరికోత్త సమాచార విప్లవంలో భాగమయ్యారు ప్రజలు. అయితే సోషల్ మీడియా మంచికి వాడేవారితో పాటు వేదింపులకి, బెదిరింపులకి సైతం అలవోకగా వాడేవారు కూడా అదిక సంఖ్యలోనే ఉన్నారు.
ముఖ్యంగా రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్న ఈ సోషల్ ఆర్మీలు విషయానికి వస్తే తెలుగురాష్ట్రాల్లో అన్ని రాజకీయ ప్రధాన పార్టీలు సోషల్ ఆర్మీని సిద్దం చేసుకుని తమ విధానాలను, తాము చేసిన మేలును ప్రచారం చేసుకుంటూనే ఉన్నాయి. కానీ తెలుగుదేశం మాత్రం ఐటీడీపీ పేరితో ఒక సోషల్ టెర్రరిస్ట్ సైన్యాన్ని సిద్దం చేసుకుంది. దీనిని ప్రత్యక్షంగా దగ్గరుండి నడిపేది నారా లోకేష్ అనేది బహిరంగ రహస్యమే , 2019లో అధికారం కోల్పోయిన రోజునే ప్రారంభమైన ఈ ఐటీడీపీ ముఖ్య పని అధికార పార్టీ విధానాలను, సంక్షేమాన్ని ఎవరు ప్రసంశించినా వారిపై సోషల్ మీడియా వేదికగా మాటల దాడులు చేసి మానసికంగా హింసించడం . ఈ వేదింపులకే తెనాలికి చెందిన గీతాంజలీ మరణించిన ఘటన ఇంకా మన కళ్ళ ముందే ఉంది.
తెలుగుదేశం సోషల్ వేదింపులు సామాన్యుల పైనే కాకుండా కేసినేని నానీ, రోజ, వల్లభనేని వంశీ, కోడాలి నానీ లాంటీ నేతలతో పాటు అటు రాజకీయాలకి దూరంగా ఉండే వైయస్ జగన్ కుటుంబంపై కూడా మార్ఫింగులతో , అసభ్య పధజాలంతో చేసిన దాడులు విదితమే .. అయితే గీతాంజలీ అనే సామాన్యురాలి మృతి తరువాత కూడా మారని ఐటీడీపీ ఇప్పుడు సామాజిక కార్యకర్తగా పేరు ఉన్న తులసీ చందూపై తమ బాణం ఎక్కుపెట్టి వేదింపులు మొదలు పెట్టారు. అయితే ఆమె తెలుగుదేశం చేస్తున్న ఈ దాడులని నేరుగా నారా లోకేష్ కే ఎక్స్ అనే సోషల్ మాధ్యమంలో ట్యాగ్ చేసి ఘాటుగా ప్రశ్నించడంతో మరో సారి ఐటీడీపీ వారి వేదింపుల భాగోతం బయటపడింది.