రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ విమర్శలకి ఏ చిన్న విషయాన్ని కూడా వదలరు రాజకీయ పార్టీలు. ఇది దశబ్ధాలుగా పరిపాటిగా వస్తున్న ఆచారం. ఐతే ఆ విమర్శల్లో వాస్తవాలు ఉంటేనే ప్రజలు మద్దతు దక్కుంది కానీ అర్ధ సత్యాలతో రాజకీయ లబ్దిపొందుదాం అనుకుంటే ప్రజలు హర్షించరు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని మూలబొడ్డవర పంచాయతీ పరిధి చిట్టంపాడు గ్రామానికి చెందిన గంగమ్మ, తన బిడ్డ పది రోజుల వ్యవధిలో అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. మృతురాలి భర్త గంగులు, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడగా. భీమిలిలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదని వాపోయారు. అయితే వీరు ఉంటున్న ప్రాంతానికి సరైన రోడ్డు మార్గం లేక డోలీలో ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడం వలనే వారు మృతి చెందారని , తన పాలనలో ఫీడర్ అంబులెన్స్ ఉండేవని ఇప్పుడు జగన్ ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్వీర్యం చేయడం వలనే ఈ మరణం సంభవించిందని చంద్రబాబు తన ట్విట్టర్ వేదికగా చేసుకుని రాజకీయ విమర్శలు చేశారు.
చంద్రబాబు చేసిన రాజకీయ విమర్శల్లో ఏమాత్రం పసలేదని గిరిజన గ్రామల్లో డోలీ మరణాలు అనే సమస్య దశాబ్ధాలుగా ఉన్న సమస్యేనని చంద్రబాబు 14ఏళ్ల పరిపాలనా సమయంలో కూడా ఈ సమస్య అత్యధికంగా ఉండేదని. చంద్రబాబు ఎన్నికలకి ఏడాది ఉందనగా తప్ప అంతకు ముందు ఈ డోలీ సమస్యపై చంద్రబాబు ఏనాడు ఆలోచన కూడా చేయలేదని గిరిజన జీవనంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.
ఈ ఫీడర్ అంబులెన్స్ విషయానికి వస్తే చంద్రబాబు పాలనలో ఎన్నికలకి ఏడాది ఉందనగా ఈ ఫీడర్ అంబులెన్స్ స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో మొత్తం 16,068 గిరిజన ఆవాసాలుంటే. చంద్రబాబుగారు పెట్టిన అంబులెన్స్ లెక్క చూస్తే శ్రీశైలంకు 6, కెఆర్ పురంకు 8, చింతూరుకు 6, రంపచోడవరంకు 21, పాడేరుకు 42, పార్వతీపురానికి 24, సీతంపేట ఐటిడిఏకి 15 మొత్తం కలిపి 122 ఫీడర్ అంబులెన్స్ మాత్రమే కేటాయించారు.
ఇక జగన్ గారి ప్రభుత్వం వచ్చాక శ్రీశైలంకు 22, కెఆర్ పురంకు 112, చింతూరుకు 81, రంపచోడవరంకు 62, పాడేరుకు 1,286, పార్వతీపురానికి 183, సీతంపేట ఐటిడిఏకి 63 మోత్తం 1,809 ఫీడర్ అంబులెన్స్లు కేటాయించి గిరిజన ప్రాంతాల్లో బాబు పాలనలోకన్నా మెరుగైన సేవలు అందిస్తున్నారు. దీనికి కారణంగానే గతంలో కన్నా రాష్ట్రంలో డోలీ మరణాలు తగ్గాయని గణాంకాలు చెబుతున్న మాట.
చంద్రబాబు 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినా గిరిజనలకి, గిరిజన గ్రామాలకి కనీస వసతులు కూడా పుర్తిస్థాయిలో అందించకుండా నేడు జగన్ గారి ప్రభుత్వం గిరిజనులకి అన్నివిధాలుగా చంద్రబాబు కన్నా అత్యధికంగా మేలు చేస్తున్నా పనికట్టుకుని చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఫక్తు ఎన్నికల స్టంట్ మాటలే కానీ గిరిజనుపై చంద్రబాబుకి ఎలాంటి ప్రేమా, అక్కర లేదనేది సుస్పష్టం.