జగన్ పాలనకూ చంద్రబాబు పాలనకూ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పాలనలో అనేక సంస్కరణలకు తెరతీసిన జగన్ ప్రభుత్వాన్ని ప్రజలకి చేరువ చేస్తే చంద్రబాబు మాత్రం తన అనుకూల వర్గాలకు మేలు చేయడానికి ప్రభుత్వాన్ని పరిమితం చేసాడు. ప్రభుత్వాన్ని సచివాలయాల ద్వారా ప్రజలకు జగన్ అనుసంధానం చేస్తే జన్మభూమి కమిటీలతో చంద్రబాబు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక అగాధాన్ని ఏర్పాటు చేసాడు. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో తేడాలు ఇద్దరి పాలనలో కనబడుతూనే ఉంటాయి.
ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలకు వంత పాడుతూ చంద్రబాబు బడులు మూయిస్తే, సీఎం జగన్ ప్రతీ వీధిలో కొలువున్న బెల్ట్ షాపులను మూయించారు. చంద్రబాబు ఇంటింటికి డోర్ డెలివరి మద్యం పాలసీ తెస్తే, జగన్ ఇంటింటికి రేషన్, పెన్షన్ పాలసీ తెచ్చారు. చంద్రబాబు పాలనలో మద్యం తయారు చేసే 14 డిస్టిలరీస్ కి అనుమతులు ఇస్తే , జగన్ పాలనలో వైద్యాన్ని అందించే 17 మెడికల్ కాలేజీలకి అనుమతులు ఇచ్చారు.
జన్మభూమి కమిటీలతో ప్రభుత్వ పథకాలను చంద్రబాబు తన అనుకూల వ్యక్తులకు కట్టబెడితే వివక్షకు లంచాలకు తావు లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతీ ఒక్కరి ఇంటికి సంక్షేమ పథకాలను చేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది. మహిళాభివృద్దికి పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలలో అగ్రభాగం వారికే ఇచ్చిన సీఎంగా జగన్ చరిత్ర సృష్టిస్తే మహిళలను నిర్లక్ష్యం చేసిన నేతగా చంద్రబాబు మిగిలిపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ పెద్ద పీట వేస్తే చంద్రబాబు తన కులానికి మాత్రమే పెద్ద పీట వేశారు. బీసీలను పెద్దల సభకు పంపిన నేతగా జగన్ రికార్డు సృష్టిస్తే, ఒక్క బీసీ నేతను కూడా పెద్దల సభకు పంపకుండా చంద్రబాబు బీసీలను అణగద్రొక్కారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలోనే లక్షా ముప్పై వేళ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేతగా సీఎం జగన్ రికార్డు సృష్టించారు. చంద్రబాబు మాత్రం జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకుని ఉద్యోగాలు ఇవ్వకుండా కాలం గడిపేశారు. సీఎం జగన్ పాలనను కొత్త పుంతలు తొక్కిస్తే చంద్రబాబు పాత తరం మూస పాలనతో వెనుకపడిపోయారనే చెప్పాలి.