చంద్రబాబు అధికారంలో ఉన్నాడు అంటేనే దేవాలయాలకు దోపిడీకి గురవుతాయి.. దేవుడికి కూడా భయం అవుతుంటుంది, ఎక్కడ తన సొమ్ము నొక్కేస్తాడో, ఎక్కడ తన గుడి కూలుస్తాడో, ఎక్కడ తన గర్భగుడిని తవ్వేస్తాడో అని..
అది ఈ మధ్య వచ్చిన కొత్త అలవాటేం కాదు.. 1995 లో సీఎం అయిన మొదటిసారి నుండే దేవాలయాల సొమ్ము మీద ఆయన కళ్ళు ఉండేవి… అరసవెల్లి దేవాలయం యొక్క అభరణాలను అప్పటి ధర్మ కర్త బ్యాంక్ లాకర్లో పెట్టగా, ఏళ్లతరబడి వాటిని తెరవకుండా ప్రత్యక్ష సాక్షులు అందరూ మరణించేవరకు దాని ఊసుఎత్తకుండా అధికారుల నిర్లక్ష వైఖరి చేత ఆ విషయమే మరుగున పడింది.. తర్వాత ఆ నగలు ఎటు పోయాయో ఎవరికీ తెలియదు….
2014-19 మధ్యలో కూడా ఇలాగే దేవాలయాల సొమ్ము ఇష్టారీతిన కాజేసిన ఘటనలు కోకొల్లలు, కర్నూలు జిల్లాలోని చెన్నం పల్లి కోటలో ఎవరో పకీరు కలలో గుప్త నిధులు గురించి వచ్చిందని చెప్పగా, రెవిన్యూ అధికార్లు, జియాలజీ శాఖవారితో కలిసి కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ రోజులతరబడి తవ్వకాలు జరిపారు… కనీసం ఈ తవ్వకాల గురించి కేంద్ర పురావస్తు శాఖవారికి కూడా సమాచారం ఇవ్వలేదు. కనీసం ఆ తవ్వకాల్లో ఏం బయటపడ్డాయో కూడా రికార్డ్ లు లేవు, మీడియా కి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు..
ఇదేవిధంగా కొండవీడు కోటని కూడా అభివృద్ధి పేరుతో 97 కోట్ల ఖర్చు తో తవ్వకాలు జరిపింది ప్రభుత్వం, అభివృద్ధి చేయాలంటే కొత్తగా నిర్మాణాలు చేపట్టాలి, లేదా ఉన్నవాటికే మెరుగులు దిద్దాలి కానీ, ఆశ్చర్యకరంగా కోటలోని శివాలయాన్ని తవ్వేశారు, బౌద్ధారామాన్ని కూడా తొలగించారు… సాధారణంగా పురాతన ఆలయాల్లో ద్రవిడ శైలి ఆలయ వాస్తు ప్రకారం విగ్రహ ప్రతిష్ట చేసినప్పుడు కానీ, ద్వజస్తంభం ఏర్పాటు సందర్భంగా కానీ అడుగు భాగాన నవధాన్యాలు, పంచలోహాలు ఉంచడం ఆనవాయితీ, ఇక మధ్యయుగం లో ఆలయాలు నిర్మించేప్పుడు పాలకులు సంపద దాచడానికి ఆలయాలను అనుకూలంగా భావించి నేలమాళిగల్లోనో, గర్భగుడిలో నో దాచేవారు.. కానీ బాబు హయాంలో జరిపిన తవ్వకాల్లో ఏ వస్తువు బయటపడిన రికార్డులు ఉండవు. అధికారులు నమోదు చేయరు.. కొండవీడు, చెన్నంపల్లి మాత్రమే కాదు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి కొండ కింద వందల ఏళ్ల క్రితం నిర్మించిన నలభైకి పైగా గుడులని రోడ్డు విస్తరణ పేర కూలదోసిన బాబు ప్రభుత్వం ఆ దేవాలయాల్లో ఏమేమి బయల్పడ్డాయి, ఏ వస్తువులను స్వాధీనం చేసుకుంది, భద్రపరిచింది అనే విషయానికి సంబంధించిన రికార్డులు నమోదు చేయనేలేదు…
సాక్ష్యాత్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆభరణాల్లో పింక్ డైమండ్ నే మాయం చేసిన ఘనత బాబుది…
ఇలా దొరికిన కాడికి దోచుకునే బాబు దేవుడి సొమ్ముని కూడా వదల్లేదు… తాగుడు మానెయ్యడానికే అయ్యప్ప మాల ధారణ చేస్తారని, వారివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది అని, హిందూ సంప్రదాయాలను వెకిలి చేసే నాస్తికుడైన బాబుకి దేవుని సొమ్ము అంటే భయం ఎందుకు ఉంటుంది…