రాజమండ్రి సమీపంలోని కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన రా కదలిరా సభల్లో పాల్గొన్న చంద్రబాబు ప్రజలకు చెప్పిన మాట ఇది. “ మాట్లాడాలంటే అర్హత ఉండాలి.. పోటీ పడాలంటే తాహతు ఉండాలి “ ఇది సిద్ధాంతం.. అర్హత, తాహతు రెండు లేని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పేవన్నీ జోకులే అవుతాయి మరి.
జీవిత పర్యంతం ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి తెచ్చుకోవడం.. ఈ పార్టీ నుండి ఆ పార్టీలోకి తెచ్చుకోవడం బాబుకి కొత్తేమి కాదు. కాంగ్రెస్ నుండి మొదలైన చంద్రబాబు ప్రస్థానం. అక్కడ ఓడిపోగానే ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని చేజిక్కిచ్చిన్న చంద్రబాబు.. టీడీపీలోని నాయకులను మంత్రులను లాక్కోని ముఖ్యమంత్రి అయ్యాడు ఆరోజు నుండి ఈరోజు దాకా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే వున్నాడు. డబ్బు, ప్రలోభాలకి లొంగిపోయి చంద్రబాబు పంచన చేరిన నాయకులకి తరువాత రాజకీయ భవిష్యత్తు ఉన్న సందర్భాలు చాలా తక్కువ. 2014 నుండి 2019 మధ్యలో వైఎస్సార్సీపీ నుండి టీడీపీలోకి 23 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఫిరాయించారు. అందులో 90 శాతం మంది ప్రత్యక్ష రాజకీయాలలో కొనసాగుతున్నట్లు కనిపించడం లేదు.. చంద్రబాబుకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వెన్నతో పెట్టిన విద్య..
ప్రస్థుతం 2024 ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతూ రాష్ట్ర ప్రజల ముందు చంద్రబాబు నాయుడు గారడీ మాటలు మాట్లాడుతున్నారు.. మేము తలుచుకుంటే వైసీపీ ఖాళీ అవుతుందంటూ జోకులేస్తున్నారు. ప్రతి ఎన్నికలకు 3 నుండి 6 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్ప ఎన్నికలలో పోటీచెయ్యలేని టీడీపీ.. ఎక్కడి గేట్లు ఎత్తి వైసీపీ నాయకులను ఆహ్వానిస్తుందని వైసీపీ వర్గాలు నవ్వుకుంటున్నాయి. అతిగతిలేని ఓ పార్టీతో పొత్తు పెట్టుకొని సీట్ల గురించి రోడ్డెక్కిన టీడీపీ గురించి చంద్రబాబు ఈ విధంగా కామెంట్లు చెయ్యడంతో ప్రజలలో పార్టీకి ఉన్న కొద్దో గొప్ప పరువుపోతుందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.