మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం 2023 డిసెంబర్ 26 నుంచి 2024 జనవరి 11వ తేదీ వరకు సమ్మె చేశారు. ప్రభుత్వంతో పలు సార్లు చర్చలు జరిపిన తర్వాత సమ్మె విరమణకు కార్మిక సంఘాలు అంగీకారం తెలపడంతో సమస్య ముగిసింది. సమ్మె ప్రారంభించిన తర్వాత మున్సిపల్ కార్మికులకు విధులకు హాజరుకావాలని మున్సిపల్ శాఖ పలుసార్లు విజ్ఞప్తి చేసింది. మున్సిపల్ శాఖ ఆదేశాలను పట్టించుకోకుండా సమ్మెను కార్మికులు కొనసాగించారు. ఆ సందర్భంలో మున్సిపల్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు విధులకు హాజరుకాని మున్సిపల్ కార్మికులపై 6 కేసులు నమోదు చేశారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలపై మున్సిపల్ సంఘాలు, ప్రభుత్వం తరుపున మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరిపారు. కార్మిక సంఘాల సమస్యలకు పరిష్కరిస్తాం అందిస్తాం అని ప్రభుత్వం తరుపున మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ హామీతో కార్మికులు సమ్మె విరమించారు. ఆ సందర్భంలో మంత్రి బొత్స సత్యనారాయణ కార్మికులపై నమోదు చేసిన కేసులు ఎత్తి వేస్తాం, కార్మికులకు 21 వేల వేతనం అందిస్తాం, సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్మికులపై నమోదు చేసిన ఆరు కేసులును ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేసులు ఉపసంహరణతో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.
సమ్మె కాలంలో మున్సిపల్ అధికారులు చేసిన ఫిర్యాదుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు వెల్లడించారు. ఈ మేరకు డిజిపికి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి లేఖ రాశారు. మున్సిపల్ కార్మికుల సమస్య సమయంలో ఏలూరు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు,నరసరావుపేట, కడపలో నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ స్పష్టం చేసింది.
మున్సిపల్ సమ్మె పోరాటం సందర్భంగా నమోదు చేసిన పోలీస్ కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. మున్సిపల్ కార్మికులపై నమోదు చేసిన కేసులు అన్నిటిని ఉపసంహరిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 357 జారీ చేయడం పట్ల ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ వర్షం వ్యక్తం చేసింది. పోలీస్ కేసులు ఎత్తివేతకు జీవో జారీ చేయడానికి కృషి చేసిన మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూల సురేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, డిఎంఏ శ్రీకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.