బాబు సీఎం అయ్యిన నాటి నుండి ప్రతి పని, ప్రతి కాంట్రాక్ట్ అయినా అక్రమ మార్గం లో తమ వారికే దక్కేలా వ్యవహరిస్తాడు. ప్రభుత్వం నుండి బయటకి వెళ్లే ప్రతి పైసా వెనక ఆయన హస్తం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాంట్రాక్టుల విషయంలో అయితే మరీను. మిగతా కాంట్రాక్టర్లు పోటీకి రాకుండా నయానా భయానా బెదిరించి, అప్పటికి పోటీ కి వచ్చిన ఇతర కాంట్రాక్టర్లను అక్రమ కేసులు బనాయించి మానసిక హింసకు గురి చేయడం ఆయనకి పరిపాటి..
పోలవరం అయితేనేం, పట్టిసీమ అయితేనేం, లేదా అమరావతి అయితేనేం ఇలా ఏ కాంట్రాక్ట్ అయినా తన వారికే ఇచ్చుకోవడం తద్వారా అందులో వాటా పొందటం బాబుకి ఈ మధ్య వచ్చిన నైజం కాదు.. మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పటి నుండీ ఇదే తంతు.
దానికి సాక్ష్యమే 1996 లో వచ్చిన ఈ వార్త :
నాడు బాబు క్యాబినెట్ మంత్రి ఒక రైల్వే కాంట్రాక్ట్ విషయమై తన వారికే ఇవ్వాలంటూ అధికారికంగా లేఖ రాసి, పోటీలో ఉన్న ఇతర కాంట్రాక్టర్లను తప్పుకోమని బెదిరింపులకు కూడా దిగాడు, బాబు పిలిచి మందలించాడు అని పత్రికలకు వార్త ఇచ్చాడు. తర్వాత సదరు మంత్రి రాజీనామా చేస్తున్నట్టు లేఖ రాయగా, మరో మంత్రి ద్వారా రాయబారం నడిపి రాజీనామాని ఉపసహరించుకునేలా చేశాడు.. ఇదంతా బాబు ఇమేజ్ బిల్డ్ చేసుకోడం కోసం జరిగిన తతంగమే… అసలు సూత్రధారి మాత్రం బాబే.. ఆయన అనునాయులకు అన్ని కాంట్రాక్టులు దక్కేలా చేయడం తద్వారా అందులో వాటా పొందటం బాబుకు పరిపాటే.. లేకపోతే తప్పు చేసిన మంత్రిని మందలించడం నిజమే అయితే, అతని రాజీనామాను ఆమోదిస్తే తను నిప్పని ఒప్పుకునేవారు కదా? అలా చేయడు ఎందుకంటే అది తనకు తెలిసే జరిగింది, మందలింపులు బుజ్జగింపులు అన్ని తన రాజకీయ నాటకంలో భాగమే.. మంత్రిగా ఉన్నప్పుడే అర్థరాత్రి టార్చ్ లైట్ లు వేసుకుని కమీషన్ల కోసం వెళ్లిన బాబుకు ఇవేం కొత్త కాదు అలాగే వింత కూడా కాదు…