కాంగ్రెస్ పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి. ఎప్పుడూ ఆయన వ్యాఖ్యలతో రాజకీయాల్లో దుమారం రేపుతూనే ఉంటారు. అయితే ప్రస్తుతం రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో కలవరం రేపుతున్నాయి.
సుదీర్ఘకాలంగా రాజకీయాలు చూస్తున్న వాళ్లకి జీవీ హర్ష కుమార్ సుపరిచితమే.. దళిత నేతగా ఉద్యమకారుడుగా ఎన్నో పోరాటాలు చేసారు. కాంగ్రెస్ పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి. ఎప్పుడూ ఆయన వ్యాఖ్యలతో రాజకీయాల్లో దుమారం రేపుతూనే ఉంటారు. అయితే ప్రస్తుతం రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో కలవరం రేపుతున్నాయి.
ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశం వర్గీకరణ… అయితే ఇది అమలుకు సాధ్యం కాదని తెలిసినా కూడా ఇలాంటి అబద్ధపు హామీలు ఇవ్వడం ద్వారా చంద్రబాబు దళిత సమాజాన్ని విచ్చిన్నం చేయటానికి కుట్రలు పడుతున్నాడన్నారు. గతంలోనూ ఇదే వర్గీకరణ అంశాన్ని తరిమేదకు తీసుకువచ్చి మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టిన పాపం చంద్రబాబు ది అని, గతంలోనే చంద్రబాబు పెట్టిన వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది అని, మోడీ లాంటివాడే దీని మీద కమిటీ వేసామని చెప్తుంటే నువ్వెలా వర్గీకరణ చేయగలవు అని ప్రశ్నించారు. కేవలం మాలల్ని మాదిగలని విడదీసి మాదిగలను తన ఓటు బ్యాంకు గా మార్చుకునే కుట్రలో భాగమే ఈ వర్గీకరణ హామీ తప్ప అది అమలుకు ఏమాత్రం సాధ్యం కాదు అని తెలుసు చెప్పారు.
రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యా బలం కలిగిన మాలలు పూర్తిగా వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నారని, దళితులందరూ కలిసి ఉంటేనే రాజ్యాధికారం సాధించగలమనే నమ్మకమే ఆ వ్యతిరేకతకు కారణం అని అన్నారు. కేవలం తన స్వార్థం కోసమే వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చాడు అన్నారు… ఆ క్రమంలోనే తనకు రామకృష్ణ అనే జడ్జి ఫోన్ చేసిన సందర్భంలో చంద్రబాబు దళితులు అంటే చాలా వ్యతిరేకత అని, దళిత సమాజం పై నరనరా అన్న వ్యతిరేకత నింపుకున్న వ్యక్తి చంద్రబాబు అని అందునా ముఖ్యంగా మాలలంటే మరింత వ్యతిరేకమని ఆయనతో అన్నారని చెప్పారు. ఇది అసలు నేను ఊహించలేదని టీవీ5 ఈనాడు లాంటి బాబు అనుకున్న మీడియాలో చూపిస్తూ ఉంటే చంద్రబాబు దళితులకు సపోర్ట్ చేస్తున్నాడు అనుకుని బ్రమపడ్డానని అన్నట్లు చెప్పారు.
ఇంకా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు హయాంలో జరిగిన అనేక అత్యాచారాలలో పెద్ద అత్యాచారం గరగపర్రు లో కుల బహిష్కరణ చేయడం అని అలాంటి గరగపర్రుని ఒక్కసారి కూడా సందర్శించిన చంద్రబాబు గురించి మాట్లాడిన విడ్డూరం అని అన్నారు. అలాగే జెర్రిపోతులు పాలెం లో 40 ఏళ్ల నుంచి ఉంటున్న స్థలాన్ని చెట్టు – నీరు ద్వారా ఆక్రమించుకోవటానికి ఒక మహిళను వివస్తరణ చేసిన నీచమైన చరిత్ర చంద్రబాబుది అని, చంద్రబాబు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని లాభం పొందడానికి చూస్తున్నాడు తప్పితే దళితుల మీద ఏమాత్రం ప్రేమలేని వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ఇంత బహిరంగంగా మాలలు నాకు వద్దు అని తేల్చి చెప్పిన చంద్రబాబుకి 54 లక్షల మంది మాలలు ఓటు వేయడంలో అర్థం లేదు ఒకవేళ వేస్తే అది వర్గీకరణ సమర్ధించడమే అవుతుంది అని, బాబు లాంటి మోసగాడికి ఓటు వేసే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఒకపక్క ఉత్తరప్రదేశ్లో బిజెపి దళితులను ఊచకోత కోస్తుందని, ముస్లింలను ఊచకోత కోస్తుందని, మరి దళిత ముస్లిం మైనారిటీలను ఊచకోత కోస్తున్న బిజెపితో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు దళితులు పట్ల ఏమాత్రం ఛత్రశుద్ధ ఉంటుందో ఆలోచించాలన్నారు.
తాను కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్ వరకు మాత్రమే తీసుకురాగలిగారని, అంతకుమించి ముందుకు సాగడానికి అవకాశం లేకుండా తాను అవసరమైతే తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కూడా హెచ్చరించానని తెలిపారు. వర్గీకరణ అంశానికి సంబంధించి ఆ తర్వాత వేసినటువంటి ఉషామహరా కమిషన్ దేశంలో వివిధ రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకునే ప్రక్రియ అన్నీ ఉంటుండగా చంద్రబాబు ఎలా తన వర్గీకరణ చేస్తానని చెప్తాడని ప్రశ్నించారు. కేవలం ఇవి ఎన్నికల జిమ్మిక్కులు తప్ప చంద్రబాబుకు దళితుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని ఎద్దేవా చేశారు. తులంతా ఓటు వేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి వేయాలని, మనని కాదనుకున్న చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.