బిజెపితో పొత్తు కోసమో, తమ వాటాలు తెగకో ఇన్నాళ్ళూ వాయిదా పడుతూ వస్తున్న టీడీపీ జనసేన కూటమికి సంభందించి సీట్ల సర్ధుబాటు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. 60-70 మందితో మొదటి జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉండవల్లిలోనే నివాసంలో టీడీపీ ముఖ్యనేతలతో కలిసి చంద్రబాబు కసరత్తు చేస్తునట్టు తెలుస్తుంది.
ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంభందించి టీడీపీ, జనసేనల ఉమ్మడి లిస్టు కోసం ఆయా నియోజకవర్గాల నాయకులు ఎదురు చూపులు ఫలించనున్నాయి. ఇన్నాళ్ళూ సీటు మాదంటే మాదన్న వివాదాలకు కొన్ని చోట్ల తెర పడనుందని చెప్పొచ్చు . సీటు ఉంటుందో జనసేన పొత్తు సాకు చూపి చంద్రబాబు తమ రాజకీయ జీవితానికి చరమగీతం పాడుతాడో అన్న భయం నుంచీ బుచ్చయ్య లాంటి సీనియర్ నాయకులకు విముక్తి కలగనుంది.
బిజెపితో పొత్తు కోసమో, తమ వాటాలు తెగకో ఇన్నాళ్ళూ వాయిదా పడుతూ వస్తున్న టీడీపీ జనసేన కూటమికి సంభందించి సీట్ల సర్ధుబాటు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. 60-70 మందితో మొదటి జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉండవల్లిలోనే నివాసంలో టీడీపీ ముఖ్యనేతలతో కలిసి చంద్రబాబు కసరత్తు చేస్తునట్టు తెలుస్తుంది. మరో పక్క ఇదే అంశంపై ఇటు మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ సైతం కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. వీరి భేటీ తరువాత రెండు పార్టీల తొలి ఉమ్మడి జాబితాను విడుదల చేయబోతున్నారు.
బిజెపితో పొత్తు కోసం ఎన్నాళ్ళు ఎదురు చూసినా ఎటూ తెగకపోవడం మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బిజెపి కోసం ఎదురు చూడలేక, అలాగని పూర్తిగా ఆశ చంపుకోలేక బిజెపి సీట్లు ఆశించే ప్రాంతాలను వదిలి మిగిలిన నియోజకవర్గాలతో రేపు సగం లిస్టు విడుదల చేసి మళ్ళీ బిజెపితో పొత్తు ప్రయత్నాలు కొనసాగించునున్నట్టు సమాచారం .