నేటి నుండి వలంటీర్లకు వందనం కార్యక్రమం..
ఎటువంటి ప్రతికూల పరిస్థితులలోనైనా రాష్ట్రప్రజలకు సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు ఈరోజు సన్మానం. ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రదానం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 రోజులపాటు జరిగే ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో గురువారం లాంఛనంగా ప్రారంభించానున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి .
సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావులేకుండా క్షేత్రస్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న అరుదైన గౌరవం ఇది. ఇప్పటికే మూడేళ్ళుగా ఈ కార్యక్రమం నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. కనీసం సంవత్సరకాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు అందించనున్నారు.
సేవా వజ్ర.. సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ. 45,000 నగదు బహుమతి.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లకు 175 నియోజకవర్గాలలో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాల ప్రధానం
సేవా రత్న.. సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ. 30,000 నగదు బహుమతి.
ప్రతి మండలం/మున్సిపాలిటీ పరిధిలో 5 మంది చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 10 మంది చొప్పున టాప్ 1 ర్యాంకు సాధించిన వాలంటీర్లకు మొత్తంగా 4,150 మందికి “సేవా రత్న” పురస్కారాల ప్రదానం.
సేవా మిత్ర.. సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ తో పాటు రూ.15,000 నగదు బహుమతి.
రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పని చేసిన 2,50,439 మంది వాలంటీర్లకు “సేవామిత్ర” పురస్కారాల ప్రదానం.
ఈరోజు నుండి ఈ నెల 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభా నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వలంటీర్లకు నగదు పురస్కా రాలు అందించనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వ హణకు ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.