పగుళ్ళు బారిన గోడలు, కూల బోయే కప్పులు,అంద చందాలు లేని అవే పాత రంగులు, పచ్చ దనమన్నది లేని ఆవరణ, తుప్పు పట్టిన గేట్లు, పారిశుధ్యమన్నదే ఎరగని మరుగు దొడ్లు, ఇవన్నీ జగన్ ప్రభుత్వం రాక ముందు ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి. వైసీపీ అధికారంలోకి వచ్చి, విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించాలని నిర్ణయించాక, శరవేగంగా స్కూళ్ళ రూపు రేఖలు మారి పోయాయి.
పటిష్టైమైన మరమ్మత్తులు,మెరుగైన పెయింటింగ్ లు అద్దుకున్న గోడలు, గోడల మీద ప్రగతిని సూచించే చిత్రాలు, పచ్చదనం నింపుకున్న ఆవరణ,అతి పరిశుభ్రంగా తయారైన మరుగుదొడ్లు, వాటిలో కావలసినంత నీటి సౌకర్యం, పిల్లలందరికీ ఏక రూప దుస్తులు… ఒకటా రెండా, కళ్ళు మూసి తెరిచే లోపు ఒక అందమైన పిల్లల లోకం ఆవిష్కృతమైంది.
అది ఆంధ్ర ప్రదేశ్ లోనే సాధ్యమైంది.
ఇది బాహ్య రూపానికి సంబంధించిన ప్రగతి అయితే చదువులో ప్రగతి విషయంలో ఎలా ఏపీ ఎలా ఉందో చూద్దాం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకున్న విప్లవాత్మకమైన మార్పులు దేశంలోని ఇతర రాస్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకునే స్థాయిలో రూపొందించబడ్డాయి. పేదలందరికీ ఉనంత విద్య అందాలనే ఆశయంతో, అందరికీ విద్య అందుబాటులో ఉండ్దాలనే ఉద్దేశంతోనూ జగన్ తీసుకున్న సరికొత్త నిర్ణయాలు ఏపీ ని స్కూలు విద్యలో దేసంలోనే టాప్ గా నిలిపాయి.
విద్యను అందించడమూ, పాఠశాలలను ఆధునికీకరించడంలో ఏపీ 38.50 శాతం మార్కులతో ప్రథమ స్థానంలో ఉండగా, 36.55 శాతంతో కేరళ రెండో స్థానంలో ఉంది.
ఇందుకు గాను జగన్ ప్రభుత్వం నిరంతరం శ్రమించింది. కోట్లు ఖర్చు పెట్టి స్కూళ్ళను ఆధునికీకరించి, చూస్తూనే ప్రతి రోజూ స్కూలుకు రావాలనిపించేలా తీర్చి దిద్దారు.
మారుఊల ఉన్న పాఠశాలలను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. నాణ్యమైన భోజనం, పౌష్టికాహారం, క్రీడా మైదానాలు,క్రీడా పరికరాలు ఏర్పాటు చేయడం ఒకెత్తు అయితే తరచూ విద్యార్థులతో జగన్ భేటీలు జరుపుతూ కీలక సమావేశాల్లో ప్రసంగించే అవకాశం కల్పించడంతో వారిలో చదువు పట్ల ఆసక్తి , ఉత్సాహం పెరిగింది.
జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రతి బడ్జెట్ లో విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించారు. మొదటి విడతలో, రెండో విడతలో కూడా వేల కోట్ల రూపాయల ఖర్చుతో అనేక వేల పాఠశాలలను హైటెక్ హంగులతో ఆధునికీకరించారు . దీని వల్ల సర్కారు బడుల్లో చేరే వారి సంఖ్య పెరిగింది.
బడి బయట ఉన్న పిల్లలను బడి దారి పట్టించేందుకు ప్రభుత్వం చేసిన కృషి ఫలించడంతో రికార్డ్ స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయి.విద్యారంగాన్ని ముందుకు నడిపించడంలో జగన్ అధికారులకు ఎంతో అండదండలుగా ఉన్నారు
పాఠశాలల్ని మెరుగు పరచడం, ప్రతి పేద వాడికీ విద్యను అందుబాటులోకి తీసుకు రావడం,ప్రతేటా విద్యా ప్రమాణాలను మెరుగు పరిచి ఉత్తమ ఫలితాలను సాధించడం,విద్యార్థులకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం, ఈ ఐదు అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
పేద విద్యార్థులకు ఆంగ్ల బోధన, నిరుపేదలకు కార్పొరేట్ విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా రెండు మూడు నెలలకోసారి ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ,సంస్కరణలపై చర్చిస్తూ, తగిన సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు.
వీటన్నిటి సమిష్టి కృషి ఫలితంగా రాష్ట్రం ఈ ఐదు అంశాల్లో రాష్ట్రం 38.50 మార్కులతో అగ్ర స్థానంలో నిలించింది అంటే ప్రభుత్వం విద్యా శాఖను నడిపించిన తీరు అర్థమవుతుంది.
విద్యే ప్రగతికి మెట్టు అని జగన్ ప్రభుత్వం నమ్మిక