గోదావరి జిల్లాలో ఓటరు నాడి మారుతోంది. మొదటి నుంచీ కాపులకు కంచుకోటగా ఉండే గోదావరి జిల్లాలు ఈ సారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్ వారాహి మీద నుంచుని చేసిన ప్రసంగాలను చూసి ఊగిపోయిన కాపు ఓటర్లు పవన్ ని సీఎంగా చూడాలని ముచ్చట పడ్డారు. కానీ, ఒక్కసారిగా పవన్ తన ప్లేటు ఫిరాయించి, కాపు ఓటర్లనూ వారి మనోభావాలను టీడీపీకి బదలాయించాలనీ చూడటం, పొత్తు లో భాగంగా కేవలం 23 సీట్లకే సరిపెట్టుకుని కాపులకు రాజ్యాధికారం అనేది కేవలం గోడ మీద బొమ్మే అన్న చందంగా టీడీపీకి లొంగిపోవడంతో… గత 2 నెలలుగా గోదావరి కాపుల్లో బాగా తేడా కనపడుతోంది.
పవన్ వ్యవహారం, జనసేన సీట్లు ,బీజేపీ సీట్లు చూసాక … జనసేన బీజేపీ అభిమానులు బాబు పట్ల చాల అసహనంగా ఉన్నారు. దీని వల్ల గోదావరి జిల్లాల్లో చాలా బలంగా కనపడవలసిన కూటమి ఫెయిల్ అయ్యే పార్టీ గా కనపడుతోంది. ఇటు జగన్ బలంగా ఉండటమే కాక, శెట్టి బలిజలకు 2 MP సీట్లు, 4 MLA సీట్లను ప్రకటించి ఒకరకంగా కూటమికి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు.
కాపు మహిళలు జగన్ పట్ల సానుకూలంగా ఉండటం, కాపుల్లో 40 ఏళ్ళు పై బడిన వాళ్లలో సగం జగన్ వైపే ఉండటం,మొత్తంగా కాపుల్లో కూడా సగం ఓట్లు జగన్ కే పడే అవకాశం ఉండటంతో…టీడీపీ వైపు కాపు ఓటు బ్యాంకు శూన్యమైపోయింది. అటు బీసీలలోనూ కూడా జగన్ కే బాగా ఆధిక్యత ఉంది. ఇక గోదావరి జిల్లాల్లోని ఎస్సీలు మొదటి నుంచి జగన్ వైపే ఉన్నారు. మొత్తంగా చూస్తే గోదావరి జిల్లాల్లో కూడా మెజారిటీ సీట్లు వైసీపీకే మళ్ళీ వచ్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.