2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేనకి ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. పొత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఉన్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనానికి పిఠాపురం సీటు కేటాయించారు చంద్రబాబు. ఆ మేరకు గత మూడు రోజుల నుండి ప్రచారం కూడా ప్రారంభించారు జనసేనాని పవన్. అయితే జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్ విషయంలో సందిగ్ధత నెలకొoది. కేంద్ర ఎన్నికల కమిషన్ గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ గా చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే జనసేన పార్టీ అభ్యర్థన మేరకు ఈ సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించనుంది.
ఇందులో కొసమెరుపు ఏంటి అంటే జనసేన పోటీ చేయని మిగిలిన నియోజకవర్గాలలో ఫ్రీ సింబల్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ నియోజక వర్గాలలో పోటీ చేస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తు జనసేనకే ఉంటుంది , మిగిలినటువంటి 154 అసెంబ్లీ ,23 పార్లమెంట్ స్థానాలలో గాజు గ్లాస్ గుర్తుపైన ఎవరైనా పోటీ చేయవచ్చు అంటూ వెల్లడించింది ఈసీ. ఒకవేళ గాజు గ్లాస్ గుర్తుపై ఎవరైనా స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తే ఎన్డీఏ కూటమికి భారీ నష్టం ఏర్పడనుంది. పొత్తులో భాగంగా పడాల్సిన ఓట్లన్నీ కూడా స్వతంత్ర అభ్యర్థులకే పడే అవకాశం ఉంటుంది. కాగా వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీలను రాష్ట్ర పార్టీలగా గుర్తిస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పోటీ చేయని 154 అసెంబ్లీ స్థానాల్లో జనసేన నుండి పోటీ చేద్దామని ఆశించి భంగపడ్డ ఆశావహులు ఈ అవకాశన్ని ఉపయోగించుకొని గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని వినికిడి.